పెట్టుబడి కష్టమే..
ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలదాడి, కూలీల లేమితో పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సుమారు 17 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయా తదితర పంటలు సాగు చేశారు.
ఆందోళనలో రైతన్నలు
తాండూరులో ఒక్కసారి కూడా పత్తి తీయని చేను
తాండూరు, తిర్యాణి న్యూస్టుడే: ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలదాడి, కూలీల లేమితో పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సుమారు 17 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయా తదితర పంటలు సాగు చేశారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టి అధిక దిగుబడులు సాధిస్తామని ఆశించారు. కానీ ఎన్నికలు, వాతావరణ పరిస్థితులు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాయి. కొంత మంది ఆశించినంత ధర లేకపోవడంతో సేకరించిన పత్తిని ఇళ్లలోనే నిల్వ ఉంచుకున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పులతో పత్తి రంగు మారి ఇప్పుడు వస్తున్న రేటు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. కల్లాలో ఉన్న ధాన్యం తడిసిపోతే సగం ధర కూడా రాదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలంటే సుమారు రూ.35 వేలు, ఎకరంలో వరి సాగు కు రూ.30 వేల వరకు ఖర్చు వస్తోంది. పరిస్థితులను బట్టి మరో రూ.5 వేలు అధికంగా ఖర్చయ్యే అవకాశముంది. పత్తితీత, వరికోతలు పూర్తికాకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసిన పత్తిని విక్రయించుకుందామన్నా క్వింటా రూ.7 వేలు పలుకుతుండటంతో ఇళ్లలోనే నిల్వ ఉంచుకుంటున్నారు.
పక్క రాష్ట్రం నుంచి కూలీలు..
జిల్లా రైతన్నలకు ఈ ఏడాది కూలీల కష్టం వచ్చి పడింది. ఎన్నికల నేపథ్యంలో అది ఇంకా పెరిగింది. ఒక్కో రైతు మొదటి దఫా పత్తి తీయడానికి కూలీలు దొరక్కపోవడంతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పత్తి తీత పనులు ప్రారంభించలేకపోయారు. చేసేదేమీ లేక మహారాష్ట్ర నుంచి కూలీలను తెప్పించుకుని పత్తి తీత పనులు చేయించుకుంటున్నారు. అయితే వారు అక్కడి నుంచి రావడం ఆలస్యం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
సేకరించింది 30 శాతమే..
జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా పత్తి తీసే పనులు 30 శాతాన్ని మించలేదు. మిగతా 70 శాతం మొక్కలపైనే ఉంది. పత్తి తీసే సమయంలో ఎన్నికలు రావడంతో కూలీలు దొరకడం కష్టంగా మారింది. స్థానికంగా ఉండే కూలీలను ఆయా పార్టీల నేతలు ప్రచారాలు, సభలకు రోజు వారీ కూలీ ఇచ్చి తరలించారు. దీంతో పత్తి తీత పనులు వెనకబడ్డాయి. ఎన్నికలు తర్వాత మిగ్జాం తుపానుతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి నేలరాలుతూ రంగు మారుతోంది. దీనికితోడు గులాబి రంగు పురుగు ఆశిస్తోంది.
ఈ సారీ నష్టపోయినట్లే..
గాజుల నగేష్, నగరం, తాండూరు
నాకున్న ఒక ఎకరం సొంత చేనుతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. కలుపు అధికంగా ఉండటం వాతావరణ మార్పులతో చీడపీడలు సోకినందున పెట్టుబడి ఖర్చు అమాంతం పెరిగిపోయింది. 5 ఎకరాలకు సుమారు రూ.1.75 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నందుకు మరో రూ.25 వేలు అదనం అయింది. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదు. మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకొచ్చి కిలోకి రూ.10 ఇచ్చి పత్తిని తీయిస్తున్నాం.
కల్లాల్లోనే ధాన్యం..
జిల్లాలో ప్రధానంగా సాగు చేసేది వరి పంటనే.. ప్రస్తుత ఏడాది ఆలస్యంగా నాట్లు వేయడం ఆయా ప్రాంతాల్లో ఆకుముడత, సుడిదోమ తెగులు ఆశించినప్పటికీ పంట దిగుబడి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సుమారు 40 శాతం కోతలు అయ్యాయి. చాలా వరకు వరి ధాన్యం కల్లాల్లోనే ఉంది. తుపాను నేపథ్యంలో ప్రభుత్వ ధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తక్కువ ధరకు రైతులు విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.2,500 నుంచి రూ.2,750 వరకు ధర పెట్టి కొనుగోలు చేసినా.. డబ్బులు చెల్లించేందుకు రెండు నెలల గడువు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం