తల్లుల చెంత.. తరాల పులకింత..!
వనదేవతల సన్నిధిలో భక్తజనం పులకిస్తోంది.. ఆధ్యాత్మిక లోకంలో తేలియాడుతోంది.. బాలలకు రంగుల ప్రపంచం ముచ్చట గొల్పుతోంది.. యువతలో భక్తిభావం వెల్లువెత్తుతోంది.
వన దేవతలకు తీరొక్క మొక్కులు
న్యూస్టుడే, మేడారం (డోర్నకల్)
వనదేవతల సన్నిధిలో భక్తజనం పులకిస్తోంది.. ఆధ్యాత్మిక లోకంలో తేలియాడుతోంది.. బాలలకు రంగుల ప్రపంచం ముచ్చట గొల్పుతోంది.. యువతలో భక్తిభావం వెల్లువెత్తుతోంది. తల్లుల చెంత కొంత సమయం గడిపేందుకు వృద్ధుల్లో చైతన్యం ఉరకలేస్తోంది.. వయసుతో సంబంధం లేకుండా పసికందు మొదలు వృద్ధుల వరకు అమ్మల దర్శనంతో తన్మయత్వం చెందుతున్నారు. మేడారంలో ఎవరిని చూసినా సమ్మక్క, సారలమ్మల నామస్మరణే.. ఆధ్యాత్మిక చింతనే..
వన దేవతల దర్శనానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు తీరొక్క మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయ ప్రాంగణం, జంపన్న వాగు వద్ద ముడుపులు కడుతున్నారు. సంతానం కోసం ఊయల, సుమంగళిగా వర్ధిల్లాలని గాజులు మొక్కుగా సమర్పిస్తున్నారు. ఎదురుకోడి, కోడె, చిల్లర నాణేలు, గంట, ఎత్తుబెల్లం(బంగారం), ఒడిబియ్యం, తలనీలాలు, తదితర మొక్కులు చెల్లిస్తున్నారు.
జాతర ప్రత్యేకతలు
- గురువారం మేడారంలోని చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెకు చేర్చారు. ఈ మహాఘట్టాన్ని చూసేందుకు చిలుకలగుట్ట నుంచి గద్దెల వరకు భక్తులు బారులు తీరారు.
- మేడారంలోని గిరిజన మ్యూజియం ఆవరణలో కోయ గిరిజనుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 30కి పైగా ఇలవేల్పులను ఆయా వంశస్థులు ఒకే చోటుకు చేర్చారు. పగిడలతో ఆదివాసీ నృత్యాలు చేశారు. ఇలవేల్పులకు పూజలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు.
- జంపన్నవాగులో ఒక్కరోజే దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా.
- వనదేవతలను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దర్శించుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
అమ్మల జ్ఞాపిక.. ఆసక్తికరం
న్యూస్టుడే, మేడారం (కాజీపేట): మేడారం జాతర గుర్తుగా ప్రముఖులకు అందించే జ్ఞాపికను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం విభిన్నంగా రూపొందించింది. గాజుగ్లాస్ ఫ్రేములో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటి మీద చెట్టు మొదళ్లకు కట్టిన చీరలతో కూడిన రూపాన్ని తయారు చేశారు. గురువారం సమ్మక్క దర్శనం కోసం వచ్చిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మంత్రి సీతక్క దీన్ని బహూకరించారు.
హెలికాప్టర్లో వెళ్లొద్దామా..
న్యూస్టుడే, కాజీపేట టౌన్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర చూసి, తల్లులను దర్శించుకోవడానికి కాజీపేట సెయింట్ గాబ్రియల్ పాఠశాల నుంచి గురువారం హెలికాప్టర్ ద్వారా భక్తులు తరలి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కాజీపేటకు చేరుకున్న హెలికాప్టర్ అప్పటికే ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందినవారిని మేడారానికి తీసుకెళ్లింది. గాలిలోకి ఎగిరిన అనంతరం 15 నిమిషాల్లో మేడారానికి చేరుకున్నట్లు భక్తులు తెలిపారు. ఒక్కొక్కరికి ప్రయాణ ఛార్జీ రూ.28,999. మేడారం అందాలను వీక్షించడానికి రూ.4,800 టికెట్ నిర్ణయించారు. హెలికాప్టర్ రోజుకు కేవలం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు మాత్రమే మేడారానికి వెళ్లగలదని తుంబే ఏవియేషన్ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
[ 27-07-2024]
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది -
అన్నదాతకు సముచిత న్యాయం
[ 27-07-2024]
ఎదులాపురం: రాష్ట్ర బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు సముచిత న్యాయం చేసిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
[ 27-07-2024]
15 మంది విద్యార్థులు ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాసినప్పటికీ వారు గైర్హాజరు అయినట్లు ఫలితాలలో చూపిస్తుందని, దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తాజ్ అన్నారు. -
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు