మొక్కల పేరిట మెక్కుడు!
అతివల ఆదాయం పెంచడంతోపాటు పేదల జీవనోపాధులు మెరుగుపరచడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ద్వారా చేపట్టిన మొక్కలు, ఉద్యానాల పెంపకం అవినీతిమయంగా మారిపోయింది.
అవెన్యూ, ఉద్యానాల పెంపకంలో అక్రమాలు
రూ. 2.38 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం
ఈనాడు డిజిటల్, పాడేరు
అతివల ఆదాయం పెంచడంతోపాటు పేదల జీవనోపాధులు మెరుగుపరచడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ద్వారా చేపట్టిన మొక్కలు, ఉద్యానాల పెంపకం అవినీతిమయంగా మారిపోయింది. వెలుగు/వైకేపీలో కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినా బాధ్యులపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోలేదు.
ఉమ్మడి జిల్లాలో 10 నుంచి 14 విడతల వరకు జరిగిన సామాజిక తనిఖీల్లో ఉద్యానాలు, రహదారి పక్కన మొక్కల పెంపకాల్లో రూ. 2.38 కోట్ల మేర సొమ్ములు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ మొత్తం ఇంకా బాధ్యుల నుంచి రికవరీ చేయలేదు. తాజాగా అనకాపల్లి జిల్లాలో రూ. 63 లక్షల రికవరీకి సంబంధించి 96 మందికి నోటీసులు సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాలో 6,874 ఎకరాల్లో డీఆర్డీఏ ద్వారా హార్టికల్చర్ పథకాన్ని అమలు చేశారు. సుమారు 2 వేల కిలోమీటర్ల మేర రహదారుల పక్కన (అవెన్యూ) మొక్కలు నాటారు. వీటి కోసం వేతనాలు, సామగ్రి రూపంలో సుమారు రూ. 22 కోట్ల వరకు ఖర్చుచేశారు. మొక్కల కొనుగోలు నుంచి పెంపకం వరకు కొన్నిచోట్ల వెలుగు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటివరకు 14 విడతలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 విడతల సామాజిక తనిఖీలు పూర్తిచేశారు. అందులో డీఆర్డీఏ ద్వారా చేపట్టిన పనుల్లో రూ. 2,38,32,118 విలువైన పనులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
20 మండలాల పరిధిలో..
అనకాపల్లి జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఈ అక్రమాలు జరిగాయి. కొన్ని మండలాల్లో అవెన్యూ ప్లాంటేషన్ను ఒక ప్రైవేటు వ్యక్తికి అనధికారికంగా అప్పగించారు. దస్త్రాల్లో మాత్రం స్వయం సహాయక సంఘాలు వాటిని పెంచుతున్నట్లు చూపారు. సామాజిక తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. అనకాపల్లి మండలంలో 12 మంది, అచ్యుతాపురంలో ఏడుగురు, మునగపాక, కశింకోట మండలాల్లో ఎనిమిది మంది చొప్పున బాధ్యులకు రికవరీ నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో మునగపాకకు చెందిన ఒక ఏపీఎం నుంచి రూ. 4.11 లక్షలు, ఓ సీసీ రూ. 3.6 లక్షలు, ఏసీ రూ. 3.6 లక్షల చొప్పున అత్యధిక మొత్తాలు రికవరీ చెల్లించాల్సి ఉంది.
తనిఖీల్లో ఎక్కువ.. రికవరీల్లో తక్కువ
గ్రామైక్య సంఘం ప్రతినిధుల నుంచి క్లస్టర్ కోఆర్డినేటర్ (సీసీ), ఏపీఎంలు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఇలా వందమందిని బాధ్యులుగా గుర్తించారు. తనిఖీల అనంతరం ఆధారాలు సమర్పించేందుకు వ్యక్తిగత విచారణలు చేపట్టారు. ఇక్కడే కొంతమంది ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని రూ. లక్షల్లో ఉన్న రికవరీ మొత్తాన్ని రూ. వేలల్లోకి తగ్గించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది తనిఖీల సమయంలో చూపించని ఆధారాలను వ్యక్తిగత విచారణలో చూపించి రికవరీల నుంచి పూర్తిగా మినహాయింపు పొందారు. దీంతోనే రూ. 1.61 కోట్ల అక్రమాలు కాస్తా చివరకు వచ్చేసరికి రూ. 68.73 లక్షలకు తగ్గిపోయాయి. ఇందులో రూ. 4.74 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. మిగతా రూ. 63.98 లక్షలు ఈనెల 7 లోపు రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బాధ్యులందరికీ నోటీసులు పంపిస్తున్నారు. అందులోనే తాము చెల్లించాల్సిన బ్యాంకు ఖాతా సంఖ్య పేర్కొని ఆన్లైన్, నెఫ్ట్ ద్వారా చెల్లించి రసీదులు చూపించాలని ఆదేశించారు. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు ఈ మాత్రం చొరవా తీసుకోలేదు.
రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం రహదారి పొడవునా తుప్పలే..
అనకాపల్లి జిల్లాలో 10వ విడత నుంచి 12వ విడత సామాజిక తనిఖీ వరకు డీఆర్డీఏ పరిధిలో రూ. 1.61 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు.
నోటీసులిస్తున్నాం..
ఉద్యానాలు, మొక్కల పెంపకం అమలులో కొంతమేర లోపాలున్నట్లు సామాజిక తనిఖీల్లో గుర్తించారు. వ్యక్తిగత విచారణలు పూర్తయిన తర్వాత రికవరీ చేయాల్సిన మొత్తానికి ఇప్పుడు నోటీసులు జారీచేస్తున్నాం. రికవరీ చెల్లించకుంటే బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.
లక్ష్మీపతి, డీఆర్డీఏ, పీడీ అనకాపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?