logo

Food Poison: పుట్టగొడుగుల కూర తిని 10 మందికి అస్వస్థత

అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో విషతుల్యమైన ఆహారం తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు.

Updated : 03 Jul 2023 11:18 IST

పాడేరు పట్టణం: అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో విషతుల్యమైన ఆహారం తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. జామిగూడకు చెందిన కొంతమంది పుట్టగొడుగుల కూర తిన్నాక వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు అర్ధరాత్రి 2 గంటలకు వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్థానిక వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని