జగన్ వీరబాదుడుకు ఇదే సాక్ష్యం
నర్సీపట్నం మండలం అమలాపురానికి చెందిన శెట్టి భగవానులు 2019 మే నెలలో 110 యూనిట్లు విద్యుత్తు వినియోగించారు. కస్టమర్ ఛార్జీలతో కలిపి రూ.373 బిల్లు ఇచ్చారు.
విద్యుత్తు బిల్లు చూస్తేనే వినియోగదారులకు షాక్
ట్రూఅప్, సర్దుబాటు ఛార్జీలతో రూ. 964 కోట్ల అదనపు భారం
నర్సీపట్నం మండలం అమలాపురానికి చెందిన శెట్టి భగవానులు 2019 మే నెలలో 110 యూనిట్లు విద్యుత్తు వినియోగించారు. కస్టమర్ ఛార్జీలతో కలిపి రూ.373 బిల్లు ఇచ్చారు. అదే వినియోగదారుడు 2023 అక్టోబర్లో 117 యూనిట్లు విద్యుత్తు వినియోగించగా రూ.574 కరెంటు బిల్లు వచ్చింది. విద్యుత్తు వినియోగం దాదాపు ఒకేలా ఉన్నా అప్పటికి, ఇప్పటికి బిల్లులో చెల్లించాల్సింది రూ.201 పెరిగింది. అప్పుడు 1-50 యూనిట్ల వరకు ఒకటే స్లాబు ఉండేది. ఇప్పుడు 1-30 వరకు ఒకటి, 30-75 యూనిట్ల వరకు మరో స్లాబు మార్చడంతో వినియోగ ఛార్జీలు పెరిగాయి. వీటికి అదనంగా ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ ఛార్జీలు కలపడంతో భారం మరింత పెరింగింది. ప్రతిపక్షంలో ఉండగా బాదుడే బాదుడు అంటూ గుండెలు బాదేసుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక వడ్డించిన వీర బాదుడుకు నిదర్శనమిదే..
ఈనాడు, అనకాపల్లి, పాడేరు: వైకాపా సర్కారు అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులపైనా ఛార్జీల భారం భారీగా మోపింది. కొన్ని వర్గాల కనెక్షన్లకు సంబంధించి టారిఫ్లో మార్పులు చేయకపోయినా స్లాబులు మార్చి దొడ్డిదారిన ఛార్జీలు పెంచేశారు. వీటికి అదనంగా 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి రెండు విడతల ఇంధన కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) ఛార్జీలను వడ్డిస్తున్నారు. సామాన్యుల విద్యుత్తు బిల్లులో ఈ వడ్డింపులే రూ.120 నుంచి రూ.150 వరకు ఉంటున్నాయి. అదే పారిశ్రామిక, వాణిజ్య వర్గాల బిల్లుల్లో అదనపు సుంకాలు రూ.వేలల్లో దాటిపోతున్నాయి. కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొట్టేలా ఉన్నాయి. ఒక్క 2023-24లో విశాఖ సర్కిల్ పరిధిలోని ఉమ్మడి జిల్లా వినియోగదారులపై రూ.964 కోట్ల అదనపు భారం మోపారు.
అదనంగా వడ్డించేశారిలా..
ట్రూఅప్ ఛార్జీలు యూనిట్కు 17 పైసలు చొప్పున సర్కిల్ మొత్తం వినియోగంపై నెలకు రూ.11.9 కోట్లు వసూలు చేశారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో వినియోగదారుల నుంచి రూ.202.3 కోట్లు వసూలు చేశారు.
ఎఫ్పీపీసీఏ-2 పేరుతో 2023 మే నుంచి యూనిట్కు 40 పైసల చొప్పున మరో భారం మోపుతున్నారు. సర్కిల్లో నెలకు సగటున 70 కోట్ల యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ఈ లెక్కన 40 పైసలు చొప్పున నెలకు రూ.28 కోట్లు అదనపు సుంకం విధిస్తున్నారు. ఇప్పటికే 12 నెలల నుంచి రూ.28 కోట్ల చొప్పున రూ.336 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశారు. మరో ఏడాది పాటు ఈ ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలు మోయాల్సిందే.
ఈ ఏడాది ఎన్నికలున్నాయని పెంపు జోలికి పోలేదు. డిస్కంలు మరో రూ.7 వేల కోట్లు ట్రూఅప్ వసూలుకు ఏపీఈఆర్సీ వద్ద ప్రతిపాదనలు పెట్టాయి. ఎన్నికల తర్వాత ఈ భారాన్ని వినియోగదారులపై వేయడానికి సిద్ధంగా ఉంచారు.
బిల్లుల భారంపై వామపక్షాల నిరసన (పాత చిత్రం)
2019లో భగవానులకు వచ్చిన విద్యుత్తు బిల్లు రూ.373
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే