కూటమి అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని పాడేరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కిల్లు వెంకటరమేష్నాయుడు పేర్కొన్నారు.
గూడెంకొత్తవీధి, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని పాడేరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కిల్లు వెంకటరమేష్నాయుడు పేర్కొన్నారు. వంచుల, జర్రెల, మొండిగెడ్డ గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో యువత, మహిళలతో మాట్లాడారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన వైకాపా నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపలేదన్నారు. కనీసం మెగా డీఎస్సీ ప్రకటించలేదన్నారు. ఎన్నికల సమయంలో కేవలం 6 వేల పోస్టులతో ప్రకటన చేసిందని చెప్పారు. యువతపై తెదేపా, జనసేన, భాజపాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తామని అధినేత చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. యువత కూటమి విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు. దేవరాపల్లి సర్పంచి బుజ్జిబాబు, భాజపా అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు, నాయకుడు చిరంజీవి, జనసేన మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు, కన్వీనర్ సిద్దార్ధ్మార్క్, కూటమి సమన్వయ కమిటీ సభ్యులు నర్సింహమూర్తినాయుడు, తెదేపా అధికార ప్రతినిధి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థి గెలుపే ధ్యేయం
జి.మాడుగుల, న్యూస్టుడే: కూటమి అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కూటమి పార్టీల మండలాధ్యక్షుడు పిన్నయ్య పేర్కొన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. తెదేపా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. భాజపా, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. జనసేన పార్టీ మండలాధ్యక్షుడు భీమన్న, భాజపా మండలాధ్యక్షుడు నూకరాజు, తెదేపా నాయకులు కళ్యాణం, నాగబ్బాయి, భీంబాబు, బాబి, రాజు, బాబూరావు, కొండలరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి విజయానికి కృషి చేద్దాం
హుకుంపేట, న్యూస్టుడే: అరకులోయ నియోజకవర్గంలో కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తలు కలసి పని చేయాలని భాజపా మండల అధ్యక్షుడు గసన్న పేర్కొన్నారు. స్థానిక కామయ్యపేట కూడలి వద్ద భాజపా కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి విజయం సాధించాలని ప్రచారాలు నిర్వహించాలని కోరారు. తెదేపా మండల అధ్యక్షుడు తులసీరావు, నాయకులు చెట్టి లక్ష్మణుడు, సర్పంచు శాంతికుమారి, రామారాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు కూటమి సమావేశం
డుంబ్రిగుడ, న్యూస్టుడే: మండలంలోని అంజోడలో కూటమి సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నామని తెదేపా మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్, క్లస్టర్ ఇన్ఛార్జులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ