జాతీయ రహదారిలో హాహాకారాలు
జాతీయ రహదారిలపై శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వాహనాలు వెళ్తున్నాయి.. రహదారికి పక్కగా ఉన్న సంచార ఫలహార వాహనం వద్ద పలువురు తమ వాహనాలు ఆపి అల్పాహారం చేస్తున్నారు.
ఉల్కిపడ్డ జనం
అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్టుడే
జాతీయ రహదారిలపై శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వాహనాలు వెళ్తున్నాయి.. రహదారికి పక్కగా ఉన్న సంచార ఫలహార వాహనం వద్ద పలువురు తమ వాహనాలు ఆపి అల్పాహారం చేస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం.. ఏమైందని తేరుకునేలోగా కంటి ముందు బీభత్సం.. తమ వారికి ఏమయ్యిందో అంటూ ఇక్కడి ఉన్న ఉన్న వారు చేసిన హాహాకారాలు మిన్నంటాయి.
కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరోతరగతి చదువుతున్న 12 ఏళ్లు బాలుడిని విగతజీవిగా మార్చగా, 10 మందిని గాయాల పాలు చేసింది. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందిన అవంతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సులో సుమారు 35 మంది విద్యార్థులు విశాఖపట్నం నుంచి మాకవరపాలెంలో కళాశాలకు వెళ్తున్నారు. బయ్యవరం వద్ద బస్సు డ్రైవర్ అమితవేగంతో వాహనాన్ని నడిపి అదుపుచేయలేక రహదారికి పక్కగా ఉన్న పలహారాలు విక్రయించే వాహనంపైకి దూసుకెళ్లడంతో కొత్తపల్లి, బుచ్చెయ్యపేట, బయ్యవరం గ్రామాలకు చెందిన 10 మంది గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే బస్సులో ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ పిల్లలకు ఏమైందోనన్న ఆందోళనతో చరవాణుల్లో సమాచారం తెలుసుకున్నారు. అనంతరం బస్సు ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అమితవేగమే ప్రమాదానికి కారణమని కశింకోట సీఐ వినోద్బాబు తెలిపారు. తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా రోడ్డు పక్కన పలహారం తిన్నందుకు తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందంటూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.
బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్టుడే: కశింకోట బయ్యవరం వద్ద శుక్రవారం జరిగిన అవంతి బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని కూటమి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణతో కలసి పరామర్శించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వం, అవంతి కళాశాల యాజమాన్యం మృతిని కుటుంబానికి, గాయపడిన వారికి తక్షణమే పరిహారం అందించాలన్నారు. కూటమి తరఫున బాధితులను ఆదుకుంటామన్నారు. తక్షణమే ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. కలెక్టర్తో మాట్లాడి బాధితులకు అండగా ఉంటామన్నారు. రిత్విక్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం