సమరానికి సమయం నెలే
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి పోలింగ్కు 58 రోజులు గడువు ఉంది. అబ్బో ఎన్నిరోజులో అనుకున్నారు. అందులో 28 రోజులు అప్పుడే గడిచిపోయాయి. తుది సమరానికి ఇంకా 30 రోజులే గడువు ఉంది.
మే 13న పోలింగ్
జుకుంటున్న ప్రచార వేడి
జిల్లాలో చంద్రబాబు, జగన్ పర్యటనలు ఖరారు
ఈనాడు, అనకాపల్లి
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి పోలింగ్కు 58 రోజులు గడువు ఉంది. అబ్బో ఎన్నిరోజులో అనుకున్నారు. అందులో 28 రోజులు అప్పుడే గడిచిపోయాయి. తుది సమరానికి ఇంకా 30 రోజులే గడువు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ ప్రధాన పార్టీ అభ్యర్థుల గుండెలు లబ్‘డబ్బు’ లబ్‘డబ్బు’ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి. ఓ వైపు గ్రామాల్లో ప్రచారాలు చేస్తూ మరో వైపు వివిధ వర్గాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ నేతలంతా తీరిక లేకుండా గడుపుతున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి నేతలంతా కదనోత్సాహంతో ముందుకు వెళుతుంటే అధికార పార్టీ నేతలు మాత్రం ఇంకా ప్రలోభాల్లోనే మునిగితేలుతున్నారు.
ఈ నెల 18న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినాన తమ పేరు బలాలు చూసుకుని మంచి ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న నర్సీపట్నం నుంచి తెదేపా అభ్యర్థి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. మిగతా నేతలు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
అధినేతల పర్యటనలతో ప్రచార వే‘ఢి’
సార్వత్రిక సంగ్రామం దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉదృతం చేయడానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లిలో పర్యటించి తెదేపా, జనసేన, భాజపా కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కూడా ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నారు. పాయకరావుపేట, చోడవరంలో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున 20న జిల్లాలో సీఎం జగన్ ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాయకరావుపేట నుంచి బస్సు యాత్ర చేపట్టి చోడవరంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇద్దరు అధినేతలు పాయకరావుపేట, చోడవరంలలో వారం వ్యవధిలోనే పర్యటించడంతో రాజకీయ వేడి పెరగనుంది. వీరి తర్వాత ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు సుందరపు విజయ్కుమార్, పంచకర్ల రమేశ్బాబు తరఫున సేనాని పవన్ మరోసారి జిల్లాకు రానుండడంతో ప్రచార వే‘ఢి’ రాజుకోనుంది.
ఇంటింటా ప్రచారాలకే మొగ్గు..
ఎన్నికల షెడ్యూల్కు ముందు నుంచే గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. పోలింగ్ సమీపిస్తుండడంతో ప్రచారాలను పరుగులుపెట్టిస్తున్నారు. గత కొన్నిరోజులు ఎండలు తీవ్రత పెరగడంతో ఇరు పార్టీలు ఇంటింటా ప్రచారానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. ఉదయం 6 గంటలకే గ్రామాల బాటపడుతున్నారు. 10 గంటలకల్లా ప్రచారాలు పూర్తిచేసుకుంటున్నారు. ఆ తర్వాత ముఖ్యనాయకులతో సమీక్షలు జరుపుతూ గెలుపు వ్యూహాలు పన్నుతున్నారు. అధికార పార్టీ నేతలు వాలంటీర్లతో అసమ్మతి నేతలకు రాయబేరాలు పెడుతున్నారు. విపక్ష పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులకు బేరాలు పెడుతున్నారు. ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో విపక్ష పార్టీల నేతలకు అధికార పార్టీ గాలం వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం