logo

పాడేరులో వైకాపాకు ఎదురుగాలి

పాడేరు నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుగాలి వీస్తోంది. ఆ పార్టీకి రెబల్స్‌ బెడద పట్టుకుంది. గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ నిట్టామామిడిపాలెం గ్రామస్థుడు, భగత సామాజికవర్గానికి చెందిన అడపా విష్ణుమూర్తి వైకాపా రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Published : 13 Apr 2024 01:38 IST

రెబల్‌ అభ్యర్థిగా అడపా విష్ణుమూర్తి

చింతపల్లి, గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: పాడేరు నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుగాలి వీస్తోంది. ఆ పార్టీకి రెబల్స్‌ బెడద పట్టుకుంది. గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ నిట్టామామిడిపాలెం గ్రామస్థుడు, భగత సామాజికవర్గానికి చెందిన అడపా విష్ణుమూర్తి వైకాపా రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈయన వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకూ గూడెంకొత్తవీధి మండల వైకాపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన సతీమణి అడపా లోవలక్ష్మి జర్రెల ఎంపీటీసీ సభ్యురాలిగా వైకాపా నుంచి గెలుపొందారు. ఈయన మరదలు విజయకుమారి గతంలో జర్రెల సర్పంచిగా పనిచేశారు. విష్ణుమూర్తి కాఫీ సంక్షేమ సంఘం నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. వైకాపాను నమ్ముకుని ఎంతకాలం పనిచేసినా తగిన గుర్తింపు, గౌరవం, సముచిత స్థానం ఉండటం లేదన్నారు. పాడేరు వైకాపా అభ్యర్థిగా ఇప్పటికే మత్స్యరాస విశ్వేశ్వరరాజును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. అదే బలమైన సామాజిక వర్గం నుంచి విష్ణుమూర్తి కూడా పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు