సొంతింటి కల.. మిగిలింది కలత
నాడు..: తెదేపా హయాంలో ఎన్టీఆర్ రూరల్, పీఎంఏవై -ఎన్టీఆర్ గ్రామీణ, అర్భన్ పేర్లతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1.15 లక్షల ఇళ్లు మంజూరు చేశారు.
ఇళ్ల నిర్మాణానికి రూపాయి సాయం ఇవ్వని ప్రభుత్వం
పేదోడి గూడు అంటే జగనన్నకు చిన్నచూపే
తెదేపా హయాంలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ
ఈనాడు, పాడేరు, న్యూస్టుడే, బృందం
నాడు..: తెదేపా హయాంలో ఎన్టీఆర్ రూరల్, పీఎంఏవై -ఎన్టీఆర్ గ్రామీణ, అర్భన్ పేర్లతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1.15 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. గ్రామీణ్ పథకంలో లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 52 వేల రాయితీతో కలిపి రూ. 2 లక్షలు యూనిట్ విలువగా ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పీవీటీజీలకు మరో రూ.లక్ష, షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనులకు రూ.75 వేలు, మైదాన ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 50 వేల చొప్పున యూనిట్ విలువకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. అదేవిధంగా ఎన్టీఆర్ అర్భన్ బీఎల్సీ పథకంలో రూ.లక్ష రాయితీ ఇచ్చి బ్యాంకులోన్ కలిపి రూ. 2.75 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో వేసేవారు. అప్పటి ధరలకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయానికి పెద్దగా తేడా ఉండేది కాదు. ఎంతో కొంత అదనంగా వేసి మంచి ఇంటిని నిర్మించుకునేవారు.
నేడు..: వైకాపా సర్కారు కొలువు తీరిన రెండున్నరేళ్ల వరకు ఇళ్ల నిర్మాణం వైపే చూడలేదు. తర్వాత పేదలందరికీ ఇళ్ల పథకం పేరుతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 72 వేల ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణ వ్యయంగా రూ. 1.8 లక్షలు ఇస్తున్నారు. ఈ మొత్తంలో కేంద్రం ప్రభుత్వం రూ. 1.5 లక్షలు ఇస్తే మిగతా రూ. 30 వేలు ఉపాధిహామీ పథకం ద్వారా చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. పైగా నిర్మాణ సామగ్రి పేరుతో ఇనుప ద్వారబంధాలు, కిటికీ ఫ్రేమ్లు, రంగులు, వైరింగ్ సామగ్రి అంటగలిపి ఇచ్చే అరకొర సొమ్ములో కొంత కోతపెడుతున్నారు. జగనన్న కాలనీల్లో ఇంటి కోసం ఇస్తున్న రూ. 1.8 లక్షలు పునాదులు తీయడానికి కూడా సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరల పిడుగు..
ఇసుక నుంచి సిమెంటు, పిక్క, ఇనుము వరకు అన్నింటా పెరుగుతున్న ధరలు చూసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రభుత్వం రూ. 1.8 లక్షలు ఇస్తున్నా ఇప్పుడున్న ధరల ప్రకారం సెంటున్నరలో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఖర్చవుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇసుక ఉచితమంటూనే రవాణాభారం నెత్తిన వేస్తున్నారు. అదనంగా సిమెంటు సరఫరా చేస్తామని చెప్పినా అమలు చేయడం లేదు. సిమెంట్ బస్తా నేడు రూ. 420 పలుకుతోంది. ఇనుము సక్రమంగా సరఫరా చేయడం లేదు.. భవన నిర్మాణ కార్మికుల కూలి రేట్లు పెరగడంతో ఇంటి బడ్జెట్ ఊహించనంత పెరిగిపోతోంది. దీంతో కొంతమంది పునాదులు, లింటల్ స్థాయి వరకు నిర్మించి వదిలేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు