తలరాతలు మార్చేది ఇలాగేనా జగన్?
అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకుండా.. అధ్యాపకుల పోస్టుల భర్తీ లేకుండా ఉత్తమ ఫలితాలు ఆశించడం కలే అవుతుంది. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలే ఇందుకు నిదర్శనం.
ఇంటర్ ఫలితాల్లో అట్టడుగున స్థానాల్లో..
పాడేరు/పట్టణం, న్యూస్టుడే
మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించాలి.. అందుకోసమే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నాం. రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల తలరాతలు మార్చుతున్నాం
సీఎం జగన్ తరచూ చెప్పే మాటలివి.
ఆయన దృష్టిలో స్కూళ్లు, కాలేజీ భవనాలకు రంగులు వేస్తే విద్యార్థుల తలరాతలు మారిపోతాయనుకున్నారేమో.
అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకుండా.. అధ్యాపకుల పోస్టుల భర్తీ లేకుండా ఉత్తమ ఫలితాలు ఆశించడం కలే అవుతుంది. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. గతేడాది వరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఫలితాలు ఇవ్వగా ఈ ఏడాది 26 జిల్లాల వారీగా విడుదల చేశారు. అందులో అనకాపల్లి, అల్లూరి జిల్లాలు అట్టడుగు స్థానాల్లో నిలిచి నిరాశపరిచాయి. ఎప్పటిలానే ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు.
అల్లూరి జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్ర నిరాశపర్చాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 48 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో 70 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులై 20వ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల కంటే గిరిజన గురుకులాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం తదితర కారణాలు ఉత్తీర్ణత శాతంపై తీవ్రంగా ప్రభావం చూపాయి.
బాధ్యులెవరు?
జిల్లావ్యాప్తంగా 22 మండలాలు ఉన్నాయి. వీటిలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రధాన సమస్యలపై దృష్టి సారించి సరిదిద్ది ఉంటే ఇంత దారుణంగా ఫలితాలు ఉండేవి కాదు. ప్రధానంగా అధ్యాపకుల కొరత కారణంగా అతిథి అధ్యాపకులతో నెట్టుకొచ్చారు. వారికి సకాలంలో వేతనాలు చెల్లించలేదు. ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం ఒక్కరు మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉండేవారు. వారు కూడా ప్రిన్సిపల్ బాధ్యతలు స్వీకరించడంతో వారి సబ్జెక్టును పిల్లలకు బోధించేందుకు సమయం దొరకని పరిస్థితి. ఒక్కో కశాశాలలో పరిమితికి మించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం, ఆపై వారికి బోధించేందుకు అధ్యాపకులు లేకపోవడంతో సిలబస్ పూర్తి చేయలేదు. పాఠ్య పుస్తకాలు సైతం సకాలంలో అందలేదు.
హై స్కూల్ ప్లస్లో జీరో శాతం
దేవీపట్నం: దేవిపట్నం మండలం ముసినిగుంట బాలికల పాఠశాల్లో హై స్కూల్ ప్లస్లో ఇంటర్ ప్రథమ ఫలితాల్లో 14 మందికి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 19 మందికి గాను ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేదు. అడ్డతీగల, వీఆర్ పురం(రేఖపల్లి), వై.రామవరం తోటకూరపాలెం కాలేజీల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.
అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 31 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయగా 11 మంది ఉత్తీర్ణులయ్యారు. 38.48 శాతం మాత్రమే నమోదైంది. నెల్లిపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 16 మందికి ఒక్కరు మాత్రమే పాసయ్యారు.
మొదటి సంవత్సరంలోనూ...
జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 233 మంది విద్యార్థులకు 222 మంది హాజరు కాగా.. కేవలం 19 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇక్కడ ఉత్తీర్ణత శాతం 8.56గా నమోదైంది. హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 229 మంది విద్యార్థులు హాజరు కాగా.. ఇక్కడ 50 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 21.83 శాతంగా నమోదైంది. అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 44 మందికి తొమ్మిది మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ కళాశాలలో 20.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వై.రామవరం కేజీబీవీలో 15 మంది హాజరు కాగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రాజవొమ్మంగి, అడ్డతీగల హైస్కూల్ ఫ్లస్లలో ఒక్కరు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇక్కడ ఒక్కో చోట నలుగురు విద్యార్థులు చొప్పున హాజరు కాగా.. ఒక్కరూ ఉత్తీర్ణులవ్వలేదు. రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 140 మందికి 17 మంది మాత్రమే పాసయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల