మాటల్లోనే మంచి.. యువతను ముంచి!!
ప్రభుత్వ కొలువు సాధన ఎంతో మంది చిరకాల వాంఛ. ఇందుకు ఎంతో శ్రమిస్తుంటారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రూ.వేలు, రూ.లక్షల్లో ఖర్చు చేస్తూ ఆహోరాత్రులు పుస్తకాలతో కుస్తీపట్టేవారు ఎందరో.
డీఎస్సీ పేరిట నిరుద్యోగులను మోసగించిన ముఖ్యమంత్రి
ప్రభుత్వ కొలువు సాధన ఎంతో మంది చిరకాల వాంఛ. ఇందుకు ఎంతో శ్రమిస్తుంటారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రూ.వేలు, రూ.లక్షల్లో ఖర్చు చేస్తూ ఆహోరాత్రులు పుస్తకాలతో కుస్తీపట్టేవారు ఎందరో. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా తమ లక్ష్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఓట్ల కోసం ఇదే అవకాశంగా భావించిన అప్పటి ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ‘మెగా డీఎస్సీ’ ప్రకటిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. తీరా వచ్చాక అదిగో ఇదిగో అంటూ అయిదేళ్లు పుణ్యకాలం గడిపేశారు. కోడ్ అమల్లో ఉంటుందని తెలిసినా ఎన్నికలకు రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పైగా ఉపాధ్యాయ పోస్టులకు భారీగా కోత పెట్టారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఒక్క అవకాశమిస్తే తమ జీవితాలతో ఆడుకున్నారంటూ అభ్యర్థులు మండిపడుతున్నారు.
పేదల దీన స్థితి
తెలియాదా?: మెగా డీఎస్సీ వస్తుందనే ఆశతో దాదాపు అయిదేళ్లుగా అభ్యర్థులు శిక్షణకు భారీగా ఖర్చు చేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. సరదాలు, సంతోషాలు పక్కనపెట్టి పుస్తకాలతో కుస్తీలు పడుతూనే ఉన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఉద్యోగం సాధిస్తే అన్నీ సర్దుకుంటాయనే ఆశతో తమ లక్ష్యంపైనే గురి పెట్టారు. కానీ వైకాపా అవేవీ పట్టవన్నట్లు వ్యవహరించింది. పైగా తమ పార్టీ అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనంటూ చెప్పుకొస్తున్న జగన్కు పేద యువత దీనస్థితి అర్థం కాలేదా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి జగన్ను నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది..?: గతంలో 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. అంతకుముందు 2018లో తెదేపా హయాంలో డీఎస్సీ ఇవ్వడంపై నాటి ప్రతిపక్షనేతగా జగన్ ప్రశ్నించారు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లకు పైగా నోటిఫికేషన్ ఎందుకివ్వలేదు? ‘త్వరలో డీఎస్సీ’ అంటూ గతేడాది ఆగస్టు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతూ వచ్చారు. త్వరలో అంటే ఎన్నికల ముందు హడావుడిగా ఇచ్చేసి.. అభ్యర్థులను మరోసారి మోసం చేయాలనుకున్నారా? ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే నియామక ప్రక్రియ ముందుకు సాగదని అధికారులకు తెలియదా? రాష్ట్రంలో 23 వేల ఖాళీలున్నాయని స్వయంగా జగనే చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక ఆ ఖాళీలెందుకు తగ్గిపోయాయి? ఇలా అనేక ప్రశ్నలు అభ్యర్థుల్లో ఉత్పన్నమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాల్లో 329 ఖాళీలు.: గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది డీఎస్సీ రాసేందుకు ఆసక్తి చూపుతారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో ఎక్కువ శాతం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన 6,100 ఉద్యోగాల్లో ఉమ్మడి జిల్లాలోని ఖాళీలు కేవలం 329. అందులో ఎస్జీటీ 101, స్కూల్ అసిస్టెంట్ 133, టీజీటీ 95. వాటికి 12 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
- జిల్లాలోని పౌర గ్రంథాలయం, ఏయూలోని వీఎస్ కృష్ణా గ్రంథాలయం, ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్, రీడింగ్ రూంలలో... అలాగే విజయనగరంలోని కేంద్రాల్లో అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఏడాది క్రితం నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యేవి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక.. మరో నోటిఫికేషన్ వచ్చేది. గతంలో తెదేపా మాదిరిగా విద్యా వాలంటీర్లను తీసుకున్నా అభ్యర్థులకు అవకాశం వచ్చేదని నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం