కూటమి జోరు.. వైకాపా బేజారు
సార్వత్రిక ఎన్నికల సమరంలో కూటమి జోరు పెంచింది. ఇప్పటికే వీరి ఈ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ, గ్రామాల్లోనూ తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి మేనిఫెస్టోపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
జిల్లాలో అధినేతల వరుస పర్యటనలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ల రోడ్డుషోపై నాయకులతో చర్చిస్తున్న రాజు, తాతయ్యబాబు
ఈనాడు, అనకాపల్లి, పాయకరావుపేట, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల సమరంలో కూటమి జోరు పెంచింది. ఇప్పటికే వీరి ఈ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ, గ్రామాల్లోనూ తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి మేనిఫెస్టోపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెల ఏడున జిల్లా అనకాపల్లిలో జరిగిన పవన్ పర్యటన కేక పుట్టించింది. క్యాడర్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు మరోసారి అధినేతల పర్యటనలు ఖరారు చేశారు. దీనిలోభాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాయకరావుపేట నుంచి ఆదివారం జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మరో రోజు వ్యవధిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు చోడవరం, ఎలమంచిలిలో ఈ నెల 16న వీరి సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ల పర్యటనలు ఖరారు కావడంతో నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉట్టిపడుతోంది. ఆదివారం పాయకరావుపేటలో ప్రజాగళం సభకు సర్వం సిద్ధం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై చంద్రబాబునాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అధినేతల పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనా వైఫల్యాలను ఎత్తి చూపనున్నారు.
రావికమతం, న్యూస్టుడే: కొత్తకోటలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్డుషో నిర్వహించనున్నారని చోడవరం అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు పేర్కొన్నారు. అధినేతలు ఇద్దరూ ఉమ్మడిగా రోడ్డుషోకు రానుండటంతో ఆదివారం సాయంత్రం కొత్తకోటలో జరగాల్సిన చంద్రబాబు రోడ్డుషోను రద్దు చేసినట్లు చెప్పారు. రోడ్డుషోను విజయవంతం చేయడంపై శనివారం రావికమతం, కొత్తకోటలలో తెదేపా, భాజపా, జనసేన నాయకులతో సమావేశమయ్యారు. తాతయ్యబాబు, మల్లునాయుడు తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం: అచ్యుతాపురంలో శనివారం కూటమి నాయకుల సమావేశం జరిగింది. కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ మాట్లాడుతూ ఈనెల 16న సాయంత్రం 5గంటలకు అచ్యుతాపురంలో తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల సభలో పాల్గొంటారన్నారు. ఈ నెల 18న ఉదయం ఎలమంచిలిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు సుందరపు ప్రకటించారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఓటరును నాయకులు, కార్యకర్తలు మూడుసార్లు కలసి గాజుగ్లాసు, కమలం గుర్తులపై ప్రచారం చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?