ఒక వైపే.. అధికారుల చూపు!!
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే...అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒకటే. ఎన్నికల అధికారులు అందర్నీ సమానంగా చూడాల్సిందే. ఏ విషయంలోనూ ఎక్కువ, తక్కువ అనే తారతమ్యాలు చూపకూడదు.
అధికార పార్టీ నేతల ఉల్లంఘనలు
పట్టించుకోని యంత్రాంగం
ప్రతిపక్షాలపై మాత్రం నిరంతర నిఘా
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే...అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒకటే. ఎన్నికల అధికారులు అందర్నీ సమానంగా చూడాల్సిందే. ఏ విషయంలోనూ ఎక్కువ, తక్కువ అనే తారతమ్యాలు చూపకూడదు. ముఖ్యంగా ఎవరు ప్రలోభాలకు గురి చేసినా చర్యల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందే. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఈనాడు, విశాఖపట్నం: ప్రతిపక్షాలు చేపట్టిన కార్యక్రమాలు ఉల్లంఘనల కింద రాకున్నా అధికారులు ప్రశ్నిస్తున్నారు. వైకాపా నేతలు బాహాటంగానే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుంటే కళ్లుమూసుకుంటున్నారు. కనీసం అటువైపే చూడడం లేదు. ఆయా నియోజకవర్గాల్లోని తనిఖీ అధికారుల నిర్లక్ష్యం మీద జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించాల్సినప్పటికీ పట్టించుకోవడం లేదు’ అన్న ఆరోపణలు వస్తున్నాయి.
తెదేపా నేతలపై కేసులు: మధురవాడలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో పాటు మరో ముగ్గురిపై అధికారులు కేసు నమోదు చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపేందుకు సద్గురు సాయినాథకాలనీలోని మసీదులో పార్టీ స్టిక్కర్లు అంటించిన మిఠాయి పొట్లాలను పంపిణీ చేశారు. దీనిపై ఓ పత్రికలో వార్త రావడంతో అప్రమత్తమైన యంత్రాంగం కేసు నమోదు చేసింది. అయితే... వైకాపా నాయకులు నగరంలోని పలు మసీదుల్లో ప్రలోభాలకు గురిచేసినా పట్టించుకోలేదు. మద్దిలపాలెంలోని మసీదులోకి వైకాపా నేత ఒకరు వెళ్లి ఓటర్లకు గాలం వేసేలా మాట్లాడినా స్పందించలేదు. పాతనగరం, గాజువాక ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేసినా తనిఖీ అధికారులకు పట్టలేదు.
అధికార పార్టీ నేతలు ప్రశ్నించరా?: అధికార పక్షం నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను పట్టించుకోకుండా.. ప్రతిపక్షాలవైతే హెచ్చరించే ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు. జీవీఎంసీ 63వ వార్డు జైఆంధ్ర కాలనీలో ఇటీవల గీతం వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆ రోజు అధిక సంఖ్యలో పేదలు వచ్చి ఆర్యోగ పరీక్షలు చేయించుకున్నారు. గీతం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించడం సాధారణం. అయినప్పటికీ నిర్వహణపై ఎన్నికల తనిఖీ అధికారులు తెదేపా నాయకులను ప్రశ్నించారు. శిబిరానికి, తెదేపాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో నిమ్మకుండిపోయారు. ఈ నెల 11న 62వ వార్డులో ఆడారి తులసీరావు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో పశ్చిమ వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ తరఫున ఆయన సోదరి ప్రచారం చేయడంతో పాటు కొందరు వైకాపా నాయకులు పాల్గొన్నారు. అధికారులకు విషయం తెలిసినా స్పందించలేదు. ఆ తర్వాత ఫిర్యాదు చేస్తే శిబిరం ముగిసింది ఎలాంటి చర్యలు తీసుకోలేమంటూ చేతులెత్తేశారు.
ఆర్పీలతో దర్జాగా: ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా జీవీఎంసీ యూసీడీ విభాగంలో కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంఘటనలు ఎన్నో బయటపడుతున్నాయి. అయినా చర్యలుకానరావడం లేదు. డ్వాక్రా సంఘాల్లోని రిసోర్సుపర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు కొందరు వైకాపా నేతలకు బాహాటంగానే కొమ్ముకాస్తున్నారు. తూర్పు, పశ్చిమంలో మహిళా సంఘాలతో వైకాపా నేతలు సమావేశాలు నిర్వహించి వారి ద్వారా ప్రలోభపెడుతున్నారు. బహిరంగ సభల్లో వారితో మాట్లాడిస్తున్నారు. జీవీఎంసీ యూసీడీలోని ఓ కీలకాధికారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. సదరు అధికారే ఆర్పీలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలున్నాయి.
సమయం మించినా: అధికార పార్టీ నేతల ప్రచారాల్లో యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నా అధికారులు ప్రశ్నించడం లేదు. రాత్రి పది గంటలు దాటితే ప్రచారాలు ఆపేయాలి. అటువంటిది కొన్ని చోట్ల కొనసాగిస్తున్నారు. తనిఖీ అధికారులు అక్కడే ఉంటున్నా కేసు నమోదు చేయకపోగా కనీసం ప్రశ్నించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే