ఒడ్డుకు చేరుకున్న తెప్పలు
పగలనక.. రేయనక.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి చేపల వేట సాగించే మత్స్యకారుల తెప్పలు ఒడ్డుకు చేరనున్నాయి. ఏటా తూర్పు తీరంలో రెండు నెలల పాటు చేపల వేట విధించే నిషేధం ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు 61 రోజుల పాటు అమలు కానుంది.
నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం
పడవను ఒడ్డుకు తీసుకొస్తున్న మత్స్యకారులు
పగలనక.. రేయనక.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి చేపల వేట సాగించే మత్స్యకారుల తెప్పలు ఒడ్డుకు చేరనున్నాయి. ఏటా తూర్పు తీరంలో రెండు నెలల పాటు చేపల వేట విధించే నిషేధం ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు 61 రోజుల పాటు అమలు కానుంది.
నక్కపల్లి, న్యూస్టుడే : జిల్లాలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాలు తీరంలో ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో 73 కిలోమీటర్ల పొడవునా తీరం ఉండగా, 31 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు 90 వేల జనాభా ఉండగా, 28 చేపల రేవులున్నాయి. సముద్రంలో వేటచేసే మత్స్యకారులకు చేపలు, రొయ్యలే ప్రధాన జీవనాధారం. వీటి సంపద లభించాలంటే వీటి ఉత్పత్తి పెరగాలి, తద్వారా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని మత్స్యసంపద సంతానోత్పత్తి జరిగే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 61 రోజులను వేట నిషేధంలో పెడతారు. ఈ సమయంలో మత్స్యకారులు సంప్రదాయ తెప్పలతో మాత్రమే వేటకు వెళ్లాలి. మర, ఇంజిన్ తెప్పలను వినియోగిస్తే నేరం చేసినట్లే. జిల్లాలో 2284 తెప్పలుంటే, ఇందులో 1955 ఇంజిన్, 329 కర్ర తెప్పలున్నాయి. ఇంజిన్ తెప్పలున్న మత్స్యకారులు ఈ రెండు నెలల పాటు ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కోవాలి. ఈ ఏడాది ఎన్నికల జరుగుతుండగా, కోడ్ నేపథ్యంలో మత్స్యకారుల గణన జరుగుతుందా లేదాని చూడాలి. గతేడాది సుమారు 11వేల మంది మత్స్యకారులు చేపల వేటకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేల పరిహారం మాత్రం అందరికీ చేరలేదు. బ్యాంకు ఖాతాలు, ఆధార్లోని తప్పిదాల పేరిట సుమారు 300 మందికి ఇప్పటికి లబ్ధి అందలేదు. ఏటా ఇలాంటి సమస్య ఉంటున్నా అధికారులు తగిన పరిష్కారం చూపకపోవడంతో మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడంలేదు.
పక్కాగా అమలు చేస్తాం
రెండు నెలలపాటు ఇంజిన్, మర పడవలతో వేట చేయడం నిషేధం. దీన్ని అతిక్రమిస్తే చర్యలుంటాయి. కర్ర తెప్పలకు ఏ ఆంక్షలు ఉండవు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో వేటకు దూరమయ్యే మత్స్యకారుల గణన చేయడానికి ఇంతవరకు ఏ ఆదేశాలు రాలేదు. నిషేధం పక్కాగా అమలు చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ప్రసాద్, మత్స్యశాఖ జిల్లా అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం