మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్యా?
పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకోవడంలో జగన్ ఘనాపాటి. తెదేపా హయాంలో ఉన్నత విద్య చదువుకునే వారికి ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను అమలు చేసేవారు.
ఈ ఏడాది మూడు విడతల సాయం
వసతిగృహ విద్యార్థులకు 50 శాతం ఎగవేత
పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకోవడంలో జగన్ ఘనాపాటి. తెదేపా హయాంలో ఉన్నత విద్య చదువుకునే వారికి ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను అమలు చేసేవారు. వైకాపా సర్కారు అదే పథకానికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా మార్చి తానే కొత్తగా తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటుంది. వాటినైనా సక్రమంగా అందిస్తున్నారా అంటే అదీ లేదు. దశలవారీగా ఇస్తామని ఏటా ఒకటి రెండు విడతల ఆర్థిక సాయాన్ని సర్కారే ఎగ్గొట్టి దగా చేస్తోంది. ఆ మేరకు విద్యార్థులపై ఫీజుల భారం పడుతోంది. రుసుములు చెల్లించలేని పిల్లల ధ్రువపత్రాలను కళాశాలలు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు దిక్కుతోచడం లేదు.
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, పాడేరు: అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు సుమారు 70 వేల మంది ఉన్నారు. ఐటీఐ మొదలుకొని ఇంజినీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థులున్నారు. వీరికి ఏటా విద్యాదీవెన నాలుగు దశల్లో తల్లిదండ్రుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు మినహా మిగతావారికి వసతి దీవెన కింద ఏటా రెండు దశల్లో ఆర్థిక సాయం అందజేయాలి. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి రూ.15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ఖాతాల్లో వేయాలి. విద్యాదీవెన సొమ్ములు కొంతవరకు అందుతున్నా రెండు విడతల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన మాత్రం ఏటా ఒక విడత చెల్లించి మరో విడత ఇవ్వకుండా మడత పెట్టేస్తున్నారు.
బటన్ నొక్కడంతో సరి
2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు విడతలుగా చెల్లించాల్సిన విద్యాదీవెన సొమ్ముల్లో ఒక విడత మాత్రమే విడుదల చేశారు. అదీ ఎన్నికలున్నాయని మార్చి 1న బటన్ నొక్కారు. ఇప్పటికీ చాలామంది ఖాతాలకు ఆ సొమ్ములు చేరనేలేదు. ఇంకా మూడు విడతల సొమ్ము బకాయిలున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఇక సర్కారు సాయం మర్చిపోయినట్లే. ఆ మేరకు తల్లిదండ్రులపై ఫీజుల భారం పడుతోంది.
వసతికి సొమ్ముల్లేవ్..
గతేడాది వరకు వసతి దీవెన కింద ఒక విద్యార్థికి రూ.20 వేలు చెల్లించాలంటే రూ.10 వేలు మాత్రమే ఖాతాల్లో వేసేవారు. మిగతా సొమ్ము ఆ విద్యార్థులు భరించేవారు. ఈ ఏడాదికి వచ్చేసరికి ఒక్క విడత వసతి దీవెన సొమ్ములు విద్యార్థులకు అందలేదు. మొత్తం డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించుకోవాల్సి వస్తోంది. సొమ్ముల్లేకుండానే ఉత్తుత్తి బటన్ నొక్కేసి విద్యార్థుల జీవితాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు.
- అల్లూరి జిల్లాలో 12457 మందికి కేవలం తొలివిడత మాత్రమే విద్యాదీవెన అందించారు. ఇంకా మూడు విడతలుగా రూ.18 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.
- అనకాపల్లి జిల్లాలో వసతి దీవెన కింద 2022-23లో (గతేడాది) 37,377 మందికి రూ. 34.61 కోట్లు ఒక విడతగా చెల్లించారు. మరో విడతగా చెల్లించాల్సిన రూ.34 కోట్లకు ఎగనామం పెట్టేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!