పాడేరులో పాట్లెన్నో..
జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. డివిజన్ కేంద్రంగా ఉన్న ఇది రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా అవతరించింది. ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది.
పాడేరు పట్టణం, న్యూస్టుడే
జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. డివిజన్ కేంద్రంగా ఉన్న ఇది రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా అవతరించింది. ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది.
ఈ పట్టణానికి రోజూ జిల్లాలోని 22 మండలాల నుంచి ప్రజలు వస్తున్నారు. వందలాది మంది ఉద్యోగుల కుటుంబాలు ఇక్కడకు తరలివచ్చాయి. విస్తరిస్తున్న జనసాంద్రతకు తగ్గట్లుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఉన్నాయి.
తాగునీటికి కటకట
పాడేరు పట్టణ పరిధిలో ప్రజలు తాగునీటి కోసం ఏళ్ల తరబడిగా అల్లాడుతున్నారు. సుండ్రుపుట్టు, లోచలిపుట్టు, మసీదు వీధి, సినిమాహాల్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్సు రోడ్డు, అంబేడ్కర్ కూడలిలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. తెదేపా హయాంలో పాడేరుకు పది కిలోమీటర్ల దూరంలోని పరదానిపుట్టు గెడ్డ నీటిని శుద్ధి చేసి పట్టణవాసులకు సరఫరా చేసేవారు. ఆ తర్వాత రేకుల కాలనీ, సుండ్రుపుట్టు, ఐటీడీఏ వెనుక భాగంలో రక్షిత పథకాలు నిర్మించారు. వీటి నిర్వహణలో లోపంతో ప్రస్తుతం ప్రజలకు తాగునీరు అందడం లేదు.
నిరుపయోగంగా రైతు బజార్
పట్టణంలో తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు బజార్ నిరుపయోగంగా ఉంది. సరైన స్థలం లేక రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. రైతు బజార్ను వినియోగంలోకి తీసుకొస్తే చిరువ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య కొంత తగ్గుముఖం పడుతుంది.
- పట్టణ శివారులోని సిల్వర్నగర్లో దాదాపు వంద కుటుంబాలు నివాసముంటున్నాయి. కాలనీకి సమీపంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడంతో స్థానికులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్యార్డును మరో చోటకు మార్పు చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ను అప్పట్లో ప్రజలు వేడుకున్నారు. డంపింగ్యార్డును మరో చోటకు మారుస్తామని ఆయన హామీ ఇచ్చినా నేటికీ పరిష్కరించలేదు.
- పాడేరులో ఒక సులభ్ కాంప్లెక్స్ కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వసతి సౌకర్యం కల్పించకపోవడంతో అద్దె ఇళ్లపై ఆధారపడుతున్నారు. ఇంటి అద్దె రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు.
విస్తరణ ఊసే లేదు..
పాడేరులో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. అంబేడ్కర్ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్సు, మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. మార్కెట్ జరిగే సమయంలో, వారపు సంతల రోజు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి పాడేరు టౌన్ ప్రాజెక్టుకు రూ.50 కోట్లతో ప్రతిపాదించారు. ఈ పనుల్లో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఆర్నెల్ల క్రితం హడావుడిగా రోడ్డు విస్తరణ పేరిట ఉన్న కాలువలను తవ్వేసి వదిలేశారు. దీని వల్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం