చినమల్లవరంలో 43 ఎకరాల జీడితోటలు దగ్ధం
ఆర్.కొత్తూరు పంచాయతీ చినమల్లవరం గ్రామంలో 8 మంది రైతులకు చెందిన సుమారు 43 ఎకరాల జీడిమామిడి తోటలు మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి.
కొయ్యూరు, న్యూస్టుడే: ఆర్.కొత్తూరు పంచాయతీ చినమల్లవరం గ్రామంలో 8 మంది రైతులకు చెందిన సుమారు 43 ఎకరాల జీడిమామిడి తోటలు మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. కూడా రాజుబాబుకు చెందిన 10 ఎకరాలు, మంగయమ్మ, లక్ష్మి, మాతే పెంటయ్యలకు చెందిన ఆరేసి ఎకరాలు, కూడా పెదవరహాలు 3 ఎకరాలు, లోవ 4, మాతే గంగయమ్మకు చెందిన 4 ఎకరాలు బూడిదయ్యాయి. దిగుబడి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులంతా లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
మారేడుమిల్లి, న్యూస్టుడే: మారేడుమిల్లిలో అటవీశాఖకు చెందిన వెదురు డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో కొన్ని వెదురు లాటులు (గుట్టలుగా పేర్చిన వెదురు కర్రలు) దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వెళ్లే రహదారిలోని గురుకుల కళాశాల ఎదురుగా వెదురు డిపో ఉంది. దీనిలో వెదురు కర్రలను లాటులుగా పేర్చి వేలం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డిపోలోని కొన్ని లాటులకు నిప్పంటుకుంది. మంటలు భారీగా ఎగిసి పడడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ డిపోకి సమీపంలోనే పెట్రోలు బంకు ఉండటంతో అంతా ఆందోళన చెందారు. వెదురు లాటులు దూరం దూరంగా ఉండటంతో పక్క వాటికి అంటుకోలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు
మారేడుమిల్లి, న్యూస్టుడే: కొండపోడుకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడి ఓ గిరిజన వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వై.రామవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలో గొప్పుల తోటమామిడి (జీటీమామిడి) గ్రామానికి చెందిన కోండ్ల అమ్మమ్మ (60) కుటుంబంతో మంగళవారం వ్యవసాయం నిమిత్తం కొండపోడు చేసుకుంటున్నారు. ఈ పనుల్లో భాగంగా తుప్పలకు నిప్పంటించగా, మంటలు చుట్టూ వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఈమెను మారేడుమిల్లి మండలం బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం