యువశక్తి హోరు.. తెదేపా శ్రేణుల్లో జోరు
తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తే, వైకాపా పాలకులు వాటిని తరిమేసి గంజాయికి అడ్డాగా మార్చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తే, వైకాపా పాలకులు వాటిని తరిమేసి గంజాయికి అడ్డాగా మార్చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. నర్సీపట్నం పురపాలక పరిధిలోని బలిఘట్టంలో మంగళవారం రాత్రి యువశక్తి పేరిట కూటమి నేతలు నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. బ్రెజిల్ నుంచి 25వేల టన్నుల మాదకద్రవ్యాలు విశాఖపట్నానికి తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. ‘మద్య నిషేధాన్ని తీసుకు వస్తామని చెప్పిన జగన్ ఈ ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు మద్యాన్ని అమ్మించారు. ఉద్యోగాలను నిస్సిగ్గుగా బహిరంగ మార్కెట్లో వేలం వేసిన వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెదేపా యువనేత విజయ్ పేరు వింటే ఎమ్మెల్యే గణేష్ ప్యాంట్ తడుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 మేనిఫెస్టోలో జగన్ మోసపూరిత హామీలతో యువతను దగా చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు. తెదేపా పాలనలో 40 నైపుణ్య శిక్షణ కేంద్రాలు నడిచేవని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గణేష్ తాడేపల్లి వెళ్లి సెల్ఫీ తీసుకోవడం తప్ప ఐదేళ్లలో ఏమైనా చేశాడా అని నిలదీశారు. అయ్యన్న అవినీతి లేని పాలన అందించారని పేర్కొన్నారు.
సీఎంతో మాట్లాడి రాష్ట్రంలో ఎనభై పాలిటెక్నిక్ కళాశాలలు ఒకేసారి ఏర్పాటు చేసిన ఘనత అయ్యన్నదని గుర్తు చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి రాజమండ్రి-విజయనగరం నాలుగు లైన్ల రహదారి కార్యరూపం దాల్చేలా చేసిన వ్యక్తి అయ్యన్న అన్నారు. తెదేపా పాలనలో నర్సీపట్నంలో ప్రాంతీయ ఆసుపత్రి ప్రసవాల్లో రికార్డు సృష్టిస్తే వైకాపా పాలనలో సెల్ఫోన్ల వెలుగులో ప్రసవాలు చేసే దుస్థితికి దిగజార్చారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు రూ.13 వేల కోట్లు ఆర్థికసంఘం నిధులు పక్కదారి పట్టించి తాడేపల్లి ప్యాలెస్కు చేర్చారని ఆరోపించారు. గులకరాయి డ్రామా జబర్దస్త్ కామెడీని మించి పోయిందని ఎద్దేవా చేశారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ప్రసంగిస్తూ ఇథనాల్ పరిశ్రమలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. యువనేత వంగవీటి రాధా మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ఎంత మేలు జరిగిందో కాదు... మీ ఇంటికి ఎంత మేలు జరిగిందో ప్రజలకు చెప్పాలని సీఎం జగన్ను నిలదీశారు. జగన్ను నమ్మి యువత మోసపోయిందన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, పుచ్చా విజయ్కుమార్, అద్దేపల్లి గణేష్ తదితరులు ప్రసంగించారు కూటమి నాయకులు బోళెం రామప్రసాద్, సురేంద్ర మోహన్, సూర్యచంద్ర పాల్గొన్నారు.
బలిఘట్టం పసుపుమయం
బలిఘట్టం మంగళవారం సాయంత్రం పసుపు మయమైంది. ఎటు చూసినా ఉత్సాహమే... తలపై టోపీలు... మెడలో కండువాలుతో యువకులు ఉరకలేస్తూ వేలాదిగా తరలివచ్చారు. తెదేపా, భాజపా నాయకుల ప్రసంగాలు కొనసాగుతున్నంత సేపూ ఈలలు, కేరింతలతో ఆద్యంతం సందడి చేశారు. యువశక్తి పేరిట నిర్వహించిన ఈ సభకు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అధ్యక్షత వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల