వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థిని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు.
అరకులోయ, అనంతగిరి, న్యూస్టుడే: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థిని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావు ఆధ్వర్యంలో రోడ్షో నిర్వహించారు. స్థానిక ఐటీఐ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ అరుకు వరకు సాగింది. అరకులోయలో స్థానిక గిరి మహిళలు వీరికి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అతికించుకొని తమ పథకాలుగా ప్రచారం చేసుకుందని ఆరోపించారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. అనంతగిరి మండలంలోని మైనింగ్ను వైకాపా నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ మాధవి సేవలు అవసరం లేదని వైకాపా వారే చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫాల్గుణ పనికిరారని వైకాపా అధిష్ఠానం గుర్తించిందని, మరి ఆయన కోడలు తనూజారాణికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారన్నారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు మాట్లాడుతూ.. ప్రజలంతా కూటమి పక్షానే ఉన్నారన్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క గిరిజనుడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్, భాజపా నాయకులు రాంచందర్, ఉమామహేశ్వరరావు, తెదేపా నాయకులు బూర్జ లక్ష్మి, ద్రౌపది, సుబ్బారావు, బాకూరి వెంకటరమణ, వంతల నాగేశ్వరరావు, దన్నేరావు, సాయిరాం, పాండురంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కూటమి విజయానికి ప్రజలంతా సహకరించాలని కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. మన్యం పర్యటనకు వచ్చిన ఆమెకు కాశీపట్నం, డముకు గ్రామాల్లో మహిళలు, స్థానిక యువత హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ములియగుడలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాజారావుతో కలిసి స్థానికులతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల