జగనాసురుల కన్ను పడితే.. జగద్రక్షకుడి ఆస్తులు గోవిందా..
మనకు ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే తలుచుకుంటాం. భగవంతుడా మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించు నీ దగ్గరకి వచ్చి మొక్కు తీర్చుకుంటామని కోరుకోవడం చూస్తుంటాం
5 వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములు స్వాహా
అన్యాక్రాంతమైనవి కొన్ని.. ఆక్రమణల్లో ఇంకొన్ని..
ఈనాడు, అనకాపల్లి - న్యూస్టుడే, బృందం
మనకు ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే తలుచుకుంటాం. భగవంతుడా మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించు నీ దగ్గరకి వచ్చి మొక్కు తీర్చుకుంటామని కోరుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు దేవుడే తనను, తన ఆస్తులను అక్రమార్కుల బారిన పడకుండా కాపాడాలని వేడుకునే పరిస్థితి వచ్చింది. దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చే భక్తులు బోలెడుమంది ఉంటారు. సాక్షాత్తూ దేవుడినే నిలువునా దోచేసే వారు వైకాపాలోనే ఉన్నారు. అధికారం మాది.. అంతా మాకే దక్కాలన్న రీతిలో దేవుడికే శఠగోపం పెడుతున్నారు.
వైకాపా సర్కారు కొలువు తీరిన తర్వాత దేవాదాయ భూములకు రెక్కలు వచ్చాయి. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఆలయాల భూములను ఆక్రమించుకుంటున్నారు.. రికార్డులను తారుమారు చేసి తమ పేరిట పట్టాలు మార్చేసి దేవుడికే తిరిగి శఠగోపం పెట్టేస్తున్నారు. ఇదేమి తీరు అని అడిగితే కోర్టుల్లో కేసులు వేసి అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు. దేవాదాయ భూములను లీజుకు తీసుకుని శిస్తులు చెల్లించి చట్టబద్ధంగా సాగు చేసుకుంటున్న రైతులు తక్కువే ఉంటున్నారు. చట్టవిరుద్ధంగా దేవుడి భూముల్లో పాగా వేసినవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏడు వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములుంటే అందులో 4 వేల ఎకరాలకు పైగా ఆక్రమణదారుల చెరలోనే మగ్గుతున్నాయి. అల్లూరి జిల్లాలోనూ గుడుల పేరిటనున్న భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి.
జిల్లా అధికారులు ఆలయాల భూముల లెక్కలన్నీ తిరగేసి ఆక్రమణలను గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. అధికార పార్టీ నేతలే ఆక్రమణదారులకు వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో అధికారులు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది.
మరిన్ని ఆక్రమణలివిగో..
మాడుగుల మండలంలో 1,107 ఎకరాలు దేవాదాయ భూములున్నాయి. ఇందులో 1,003 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. కె.కోటపాడు మండలంలో 709 ఎకరాల దేవుడి మాన్యానికిగాను 569 ఎకరాలు ఆక్రమణదారుల చెరలోనే ఉన్నాయి. రాంబిల్లి మండలంలో 468 ఎకరాలకు గాను 172 ఎకరాలు, అనకాపల్లిలో 397 ఎకరాల్లో 187, నక్కపల్లిలో 409 ఎకరాల్లో 138 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. అనకాపల్లి పట్టణంలో దేమునిగుమ్మం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలకు చెందిన విలువైన స్థలాలు, భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆక్రమణదారుల్లో ఒకరు దేముడు స్థలాన్నే ఏకంగా బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. బాకీ చెల్లించక పోవడంతో బ్యాంకు వారు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.15 కోట్లు ఉంటుంది.
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో..
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంతూరు తారువాను ఆనుకుని ఉన్న దేవాదాయ భూములకే రక్షణ లేకుండా పోయింది. మారేపల్లిలో సీతారామస్వామి గుడి పేరున 23.15 ఎకరాలుంటే అవి రెండు మూడు చేతులు మారి ఇప్పుడవి ఓ రియల్టర్ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకోవడానికి దేవాదాయశాఖ తంటాలు పడుతోంది. ఇటీవలే రిజిస్ట్రేషన్లు జరగకుండా 22ఎ (1సి)లో పెట్టినా ఆ స్థిరాస్తి వ్యాపారికి మంత్రి అండదండలుండటంతో బోర్డులు పెట్టడానికి సాహసించలేకపోతున్నారు. కోర్టుల్లో వివాదం నడుస్తోంది.
రాములోరి భూములపై రాబందులు..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో సర్వే నెం.01 నుండి 101 వరకు భద్రాచల శ్రీ సీతారాముల వారి దేవస్థానానికి చెందిన సుమారు 890 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ప్రస్తుతం సుమారు 105 ఎకరాల భూమి ఆక్రమణ గురయింది. ఇందులో వైకాపాకు చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు 15 ఎకరాల్లో వ్యాపార సముదాయం నిర్మించి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కావటంతో అధికారులు ఏమి చేయలేక చేతులెత్తేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అదే వైకాపా ప్రజా ప్రతినిధి అండదండలతో సుమారు 90 ఎకరాల భూమిని ఆక్రమించారు. ఎమ్మెల్సీ అనంత బాబు అనుచరులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు