జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.
మావోయిస్టుల ప్రభావంతో నిర్ణయం
ఈనాడు, పాడేరు - న్యూస్టుడే, సీలేరు, పాడేరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ దెబ్బతిన్న మావోయిస్టులు షెల్టర్ జోన్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో (ఏఓబీ) అడుగుపెట్టే ఆస్కారముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించమని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత, సీనియర్ నాయకుడి ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో చాపకింద నీరులా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిఘా విభాగానికి సమాచారం అందడంతో ఏఓబీపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. సరిహద్దు ప్రాంతాలన్నింటిపై నిఘా పెట్టారు. పెద్ద ఎత్తున గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలతో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఒడిశా పోలీసులు, నిఘా విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ అల్లూరి జిల్లా పోలీసులు మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అభ్యర్థులు మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని పార్టీల నేతలకు సమాచారం ఇచ్చారు. సరిహద్దుల్లో ఉన్న వై.రామవరం-గూడెంకొత్తవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు హెలికాప్టర్లు వాడాలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 30 పోలింగ్ కేంద్రాలను సమీప గ్రామాలకు మార్చడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ‘ఈనాడు’తో చెప్పారు. పొరుగు రాష్ట్రంలో దెబ్బతిన్నారు కాబట్టి ఏఓబీలో ఆశ్రయానికి మావోయిస్టులు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. పోలీసు బలగాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలనే మార్పు చేశామని, వాటిపై స్థానిక ఓటర్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల