మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
బుచ్చెయ్యపేటలో రాజీనామా లేఖలు చూపుతున్న వాలంటీర్లు
బుచ్చెయ్యపేట, న్యూస్టుడే: వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఎన్నికల విధులతోపాటు తాత్కాలికంగా పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వీరిని ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి వైకాపా నాయకులు వాలంటీర్లతో రాజీనామా చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తెదేపా అధికారంలోకి వస్తే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించడం, వాలంటీర్లకు రూ.పది వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పడంతో కొంతమంది రాజీనామాలకు వెనుకాడుతున్నారు. ఈ క్రమంలో బుచ్చెయ్యపేట మండలంలో ఇప్పటివరకు ఎవరూ రాజీనామా చేయలేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో గురువారం కొందరు రాజీమానాలు చేశారు. మరికొన్ని గ్రామాలకు చెందిన వాలంటీర్లు శుక్రవారం చేయనున్నట్లు సమాచారం.
48 మంది వాలంటీర్ల రాజీనామా
కె.కోటపాడు: మండలంలో 48 మంది వాలంటీర్లు గురువారం రాజీనామా చేశారని ఎంపీడీఓ అప్పలరాజు పేర్కొన్నారు. లంకవానిపాలెంలో 4, చౌడువాడలో 31, సూదివలసలో 5, రొంగలినాయుడుపాలెం, పైడమ్మపేట గ్రామాలకు చెందిన ఇద్దరు, గొట్లాంలో ఆరు గురు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారని చెప్పారు.
చీడికాడ, దేవరాపల్లి: చీడికాడ మండలం కోనాం సచివాలయ పరిధిలోని గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరంతా ఎంపీడీఓ ఉమామహేశ్వరి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావుకు రాజీనామా లేఖలు అందజేశారు. దేవరాపల్లి మండలం కలిగొట్ల, వెంకటరాజుపురం, తామరబ్బ పంచాయతీలకు చెందిన 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేస్తూ ఆయా పంచాయతీ కార్యదర్శులకు లేఖలు ఇచ్చారు.
అచ్యుతాపురం: వైకాపా నాయకులు ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా రాజీనామా చేయడానికి వాలంటీర్లు ససేమిరా అంటున్నారు. మండలంలో 467 మంది ఉండగా ఇప్పటివరకు సగం మంది కూడా రాజీనామాకు ముందుకు రాలేదు. మార్టూరు నుంచి అతికష్టం మీద గురువారం రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయం ఏఓ కృష్ణకు అందించారు. వాలంటీర్లు వైకాపా నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నా అందుకు అంగీకరించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ