జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది.
నిరుపయోగంగా సంపద కేంద్రాలు
చింతపల్లిలో పేరుకుపోతున్న పాలిథిన్ వ్యర్థాలు
చింతపల్లి, న్యూస్టుడే: చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. ఈ కేంద్రానికి పలు విడతలుగా ఇప్పటివరకూ సుమారు రూ.10 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారులకు కాసులు పండించింది తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక పంచాయతీల్లో నిర్మించిన సంపద కేంద్రాలు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయాయి.
చింతపల్లిలో సంపద కేంద్రం
చింతపల్లి మండలంలో 17 పంచాయతీలున్నాయి. వీటిలో చింతపల్లి ఒక్కటే మేజరు పంచాయతీ. సుమారు 14వేల మంది పైచిలుకు జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. నిత్యం చింతపల్లి వచ్చి వెళ్లేవారి సంఖ్య మూడు వేల నుంచి ఐదు వేల మధ్య ఉంటుంది. దీంతో ఇక్కడ చెత్త సమస్య అధికంగా ఉంటోంది. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత పంచాయతీకి పెద్ద సవాలుగా మారింది. కొద్దికాలం క్రితం వరకూ ఒక ఎడ్లబండి, ఐదుగురు సిబ్బందితోనే నెట్టుకొచ్చేవారు. స్వచ్ఛభారత్ మిషన్లో రెండు ట్రాక్టర్లు వచ్చాయి. అయినా తగినంత పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో వీధులన్నీ చెత్తాచెదారాలతో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించే లక్ష్యంతో చింతపల్లిలో ఏర్పాటు చేసిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం వినియోగంలోకి వచ్చినా దీని ద్వారా ఆదాయం ఏమీ రావడం లేదు. ఇక మండలంలో నిర్మించిన 14 సంపద కేంద్రాలు నిరుపయోగంగానే ఉంటున్నాయి.
కార్మికులకు వేతనాల్లేవు
జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట వైకాపా ప్రభుత్వం 2021లో హడావిడి చేసింది. ఆ తరువాత క్లాప్ మిత్రల పేరిట పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించినా వారికి నెలనెలా సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదు. నెలకు రూ. ఆరు వేల చొప్పున ఒక్కో కార్మికునికి 15వ ఆర్థిక సంఘం నిధులతో అప్పుడప్పుడు జీతాలు ఇస్తున్నారు. నెలలు తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల క్లాప్ మిత్రలు విధులకు హాజరు కావడంలేదు.
సీఎం పర్యటనతో..
విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చేయడానికి కొద్దినెలల క్రితం ముఖ్యమంత్రి జగన్ చింతపల్లి వచ్చారు. ఆయన కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణానికి ఆనుకునే డంపింగ్ యార్డు ఉంది. అక్కడే ఘన సంపద కేంద్రం ఉంది. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో జిల్లాలోని అధికార యంత్రాంగం అంతా ఉరుకులు పరుగులు పెట్టి డంపింగ్ యార్డు ప్రాంగణాన్నంతటినీ శుభ్రం చేయించారు. ఇందుకోసం వందల సంఖ్యలో కార్మికులను వినియోగించారు. ఆయన వెళ్లాక పరిస్థితి మళ్లీ షరా మామూలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం