స్పందించాల్సిన తరుణమిదే!
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి.
దరఖాస్తులకు 22తో గడువు పూర్తి
దివ్యాంగులు, వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసుకునే అవకాశం
కార్యాలయంలో 12 డి దరఖాస్తు ఇస్తున్న ఓటరు కుటుంబ సభ్యుడు
నక్కపల్లి, న్యూస్టుడే: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. ఈ కోవలోనే దివ్యాంగులు, వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం అమలులోకి తెచ్చింది. మే 13న జరిగే ఎన్నిక కోసం ఇలాంటి వారంతా దరఖాస్తు చేసుకోడానికి గడువు ఈనెల 22తో ముగియనుంది.
గత సార్వత్రిక ఎన్నికల వరకు ఎన్నికల దివ్యాంగులు, వృద్ధులు నేరుగా పోలింగ్ కేంద్రానికే వచ్చి ఓటేయాల్సిన పరిస్థితి. కొన్ని పార్టీల మద్దతుదారులు ఇలాంటి వారిని తామే స్వయంగా కేంద్రాలకు తీసుకువచ్చి ఓటేయిస్తుండటంతో ఇందులో పారదర్శకత లోపిస్తోంది. దీనికి తోడు ఇళ్ల నుంచి రాలేనివారు ఓటు వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులు, అనారోగ్య కారణాలతో ఇళ్లకే పరిమితమైనవారు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం ఫారం 12డిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీరి సేకరించిన ఎన్నికల సంఘం ఆ మేరకు బూత్స్థాయి అధికారుల ద్వారా వారికి 12డి ఫారాలు అందించేలా చొరవచూపింది. ఆసక్తి ఉన్నవారంతా దరఖాస్తులు నింపారు. మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇళ్లకే పరిమితమైన వారిని బీఎల్వోలు గుర్తించి దరఖాస్తులు అందిస్తున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో దివ్యాంగ ఓటర్లు 25 వేలకుపైగా ఉండగా, 85 ఏళ్లు దాటిన వృద్ధులు సుమారు 8 వేల మంది ఉంటారని అంచనా. ఇళ్ల వద్ద అనారోగ్య సమస్యలతో మంచాలకు పరిమితమైనవారు వందల సంఖ్యలో ఉంటారని అంచనా. కాగా ఇంటి వద్ద ఓటేయడానికి అనుమతి పొందిన వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయడం కుదరదు. ఓటు పొందినవారికి పోస్టల్ బ్యాలెట్ అందిస్తారు. ఆ మేరకు సెక్టోరల్ అధికారి పోలింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. బూత్స్థాయి అధికారి, పోలీసు అధికారి పర్యవేక్షణ, ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇలాంటి వారు రహస్యంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు. హోం ఓటింగ్ కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు.
రెండు విడతల్లో..
12డి దరఖాస్తు ఇవ్వడానికి ఈనెల 22తో గడువు ముగియనుంది. వీరికి 24వ తేదీ తర్వాత ఓటు వచ్చిన విషయాన్ని బీఎల్వోల ద్వారా తెలియజేస్తాం. ఈ మేరకు వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తేదీలోగా రెండు విడతల్లో పోలింగ్ చేయిస్తాం. మొదటి విడతలో వినియోగించుకోనివారు, రెండో విడతలో ఓటేయొచ్చు. అర్హులు ఎవరైనా పోస్ల్టల్ బ్యాలెట్ కోరుకుంటే 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇక కేంద్రాలకు వచ్చి ఓటేసే దివ్యాంగులకు కేంద్రాల వద్ద ర్యాంపులు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంటాయి.
కె.గీతాంజలి, ఆర్ఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు