సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే.
కాకినాడ సభకు ఉమ్మడి జిల్లా నుంచి 450 బస్సుల తరలింపు
నేడు కశింకోటలో సభకు అంతకు మించి సమకూర్చిన ఆర్టీసీ
జాతీయ రహదారిపై రాకపోకలకు నరకం
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, కొత్తూరు(అనకాపల్లి)
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. అన్నకు హారతులివ్వడానికి, పూలు జల్లడానికి బలవంతపు ఏర్పాట్లు చేయాల్సిందే. జనాల అవస్థలతో జగన్కు సంబంధం లేదు. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ప్రజలంతా తన కోసమే వచ్చారంటూ డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయించుకుంటారు.
మందీమార్బలంతో ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర సాగిస్తున్న జగన్ శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించారు. శనివారం కశింకోట మండలం గొబ్బూరులో ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. రెండునెలల క్రితం ఇదే మండలంలో చేయూత సభ పెట్టి, జాతీయ రహదారిని దిగ్భందం చేసి ప్రయాణికులకు నరకం చూపించారు. తాజాగా జాతీయ రహదారిని ఆనుకునే మరలా సభ నిర్వహిస్తుండడంతో బాబోయ్ జగన్ అంటూ భయపడుతున్నారు.
ట్రాఫిక్ కష్టాలు షురూ..
కశింకోట మండలం పిసినికాడ సమీపంలో రెండు నెలల క్రితం చేయూత సభ పెట్టారు. జాతీయ రహదారిపై రాకపోకలను 40 కి.మీ ముందే మళ్లించేశారు. సభకు జనాలను తరలించే వాహనాలతో ఒక పూటంతా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎంతలా అంటే అంబులెన్స్లకు కూడా దారివ్వలేనంతగా. గుండెపోటుకు గురైన ఓ ఉపాధ్యాయురాలు సీఎం సభ ట్రాఫిక్ కారణంగా సకాలంలో ఆసుపత్రి చేరలేక మృతిచెందింది. ఇప్పుడు ఏకంగా నక్కపల్లి మండలం గొడిచర్ల నుంచి అనకాపల్లి పట్టణం వరకు బస్సు యాత్ర జాతీయ రహదారిపైనే సాగనుంది. గొబ్బూరు వద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ బస్సు యాత్ర గురించి తెలిసిన వారిలో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా వెతుక్కుంటున్నారు. మరికొందరు ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
బస్సులన్నీ వాళ్లకే..
కాకినాడలో సిద్ధం సభ జరిగితే విశాఖ నుంచి 350, అనకాపల్లి జిల్లా నుంచి 100 బస్సులు వైకాపాకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం నాటి సిద్ధం సభకు ఉమ్మడి జిల్లాలో 700 పైగా బస్సులు వినియోగిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి బస్సులు ఎక్కువ తరలించబోతున్నారు. దీంతో ప్రయాణ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 120 బస్సులను కేటాయించామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి పద్మావతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు