రామోజీ ఫిల్మ్సిటీలో హాలిడే కార్నివాల్
వేసవిలో వినోదం, ఆహ్లాదం పంచేందుకు రామోజీ ఫిల్మ్సిటీలో హాలిడే కార్నివాల్ సిద్ధమైంది. ఈ నెల 25న ప్రారంభమయ్యే కార్నివాల్ 46 రోజుల పాటు సందర్శకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేయనుంది.
ఈనెల 25 నుంచి ప్రారంభం
తొలిసారి వర్చువల్ షూట్ అనుభూతి పంచేలా..
మెరిసే గార్డెన్
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: వేసవిలో వినోదం, ఆహ్లాదం పంచేందుకు రామోజీ ఫిల్మ్సిటీలో హాలిడే కార్నివాల్ సిద్ధమైంది. ఈ నెల 25న ప్రారంభమయ్యే కార్నివాల్ 46 రోజుల పాటు సందర్శకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేయనుంది. తొలిసారి వర్చువల్ షూట్ అనుభూతిని పర్యాటకులు ఆస్వాదించేందుకు అవకాశం కల్పించారు. కార్నివాల్లో ఉల్లాసంగా, ఉత్తేజపరిచే సరికొత్త అనుభూతిని పంచేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వేడుకల్లో భాగంగా ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు రోజంతా సరికొత్త వినోదం, ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.
దక్షిణ భారతదేశంలో పెద్దది
రామోజీ ఫిల్మ్సిటీ హాలిడే కార్నివాల్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రెయిన్ డ్యాన్స్ ఫ్లోర్పై పర్యాటకులకు వేసవిలో సరదాగా గడిపేందుకు వీలు కల్పిస్తోంది. వేసవి తాపం దూరం చేసేలా సిద్ధం చేసిన రెయిన్ డ్యాన్స్ ఫ్లోర్లో పర్యాటకులు ఉత్సాహం నింపే బీట్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ చిటపట చినుకుల్లో తడిసిముద్దవుతూ ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశారు.
సరికొత్త ఆకర్షణలు
మ్యాజికల్ గ్లో గార్డెన్ సందర్శకులను మైమరిచేలా చేయనుంది. సాయంత్రం వేళల్లో ప్రకాశవంతమైన గార్డెన్ వీక్షణ కలల లోకాన్ని కళ్ల ముందుకు తెస్తుంది. రంగురంగుల విద్యుత్తు దీపకాంతుల్లో మెరిసే గార్డెన్లో జంతు ఆకృతులు, శిల్పాలు ఇలా ఒక్కటేమిటి పరిసరాలు మొత్తం జిగేల్ మనేలా భూతల స్వర్గాన్ని తలపిస్తుంది.
మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్
పర్యాటకులు ఫిల్మ్సిటీలో వర్చువల్ ప్రొడక్షన్ సెట్లోకి అడుగు పెట్టవచ్చు. చలనచిత్ర నిర్మాణాన్ని సమూలంగా మార్చేసి, కొత్త యుగం సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చిన సాంకేతికత.. మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్తో సందర్శకులు మర్చిపోలేని అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.
కార్నివాల్ పరేడ్
హాలిడే కార్నివాల్లో పరేడ్ సందర్శకులకు కనువిందు చేయనుంది. కలల మార్గంలో కదిలే వినోదం మైమరిచేలా చేస్తుంది. నృత్యకారులు, స్టిల్ట్ వాకర్లు, విదూషకులు పంచే వినోదం ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా డీజే ఆన్వీల్స్తో స్ట్రీట్ పార్టీ అనుభూతిని పంచుతుంది. లైవ్లీ డ్యాన్స్ ఫ్లోర్గా మారి వినోదం అందిస్తుంది. మిరుమిట్లు గొలిపే వాతావరణంలో సాయంత్రం వేళల్లో విశాలమైన మార్గాల్లో విహారం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోనుంది.
అనేక టూర్ ప్యాకేజీలు
హాలిడే కార్నివాల్ను ఆస్వాదించాలనుకొనే వారికి వివిధ టూర్ ప్యాకేజీలను అందుబాటులో ఉంచారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వేడుకలను ఆస్వాదించేలా వివిధ ప్యాకేజీలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు సైతం ప్యాకేజీతో వేడుకల్లో పాలుపంచుకోవచ్చు. అంతేకాదండోయ్ రామోజీ ఫిల్మ్సిటీలోని హోటళ్లలో విడిది చేసి హాలిడే కార్నివాల్ను ఆస్వాదించేందుకు వివిధ స్టే ప్యాకేజీలూ ఉన్నాయి.మరిన్ని వివరాలకు.. www.ramojifilmcity.com లో లాగిన్ అవ్వండి. 76598 76598కి ఫోన్ చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం