గురువులపై గుర్రు!
పాఠాలు బోధించే గురువులను నిర్లక్ష్యం చేసి బడులకు రంగులు, గోడలపై బొమ్మలు వేసి పిల్లల తలరాతలు మార్చేశామని జగన్ జబ్బలు చరుచుకుంటున్నారు.
ఉపాధ్యాయులతో ఆడుకుంటున్న జగన్
పాఠశాలల్లో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
ఈనాడు, పాడేరు, న్యూస్టుడే, రంపచోడవరం
పాఠాలు బోధించే గురువులను నిర్లక్ష్యం చేసి బడులకు రంగులు, గోడలపై బొమ్మలు వేసి పిల్లల తలరాతలు మార్చేశామని జగన్ జబ్బలు చరుచుకుంటున్నారు. ఉపాధ్యాయులకు బోధన కంటే ఇతర విధులే ఎక్కువ అప్పజెబితే విద్యావ్యవస్థలో ఎన్ని మార్పులు తెచ్చినా చదువులో పిల్లలు ఎలా రాణిస్తారన్న ఇంగితజ్ఞానం పాలకుల్లో లేకుండా పోతుంది. గత రెండేళ్లలో నమోదైన పదో తరగతి ఫలితాలే ఇందుకు నిదర్శనం. సర్కారు పాఠశాలల్లో బోధనేతర పనులపైనే ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడుపుతున్నారు. టీచర్లు, విద్యార్థుల హాజరు నుంచి మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ వరకు అన్నింటినీ యాప్ల్లో నమోదు చేయడానికి తంటాలు పడుతున్నారు. పుస్తకాలు పట్టుకుని పాఠాలు చెప్పడం కంటే సెల్ఫోన్లు పట్టుకుని నాడు-నేడు పనులు, కిచెన్షెడ్లు, మరుగుదొడ్ల ఫొటోలు తీయడానికే గురువులకు సమయమంతా సరిపోతోంది.
ఒక పూటంతా అదే పని..
- ఉదయం పాఠశాలకు రాగానే ఉపాధ్యాయులు ఐరిస్ ఆధారంగా హాజరు నమోదు చేసుకోవాలి. తొలి పిరియడ్లోపు విద్యార్థుల హాజరు కూడా యాప్లోనే నిక్షిప్తం చేయాలి. ఒక్కో పాఠశాలలో విద్యార్థులు వందల సంఖ్యలో ఉండడంతో వారి హాజరంతా ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి చాలా సమయమే తీసుకుంటుంది. ఆ సమయంలో బోధన కూడా సక్రమంగా జరగడం లేదు.
- టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్) యాప్లో ఆయాల హాజరు నమోదు చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఎన్ని బేసిన్లు ఉంటే అన్నింటికీ ఫొటోలు తీయాలి.
- ఐఎంఎంఎస్ యాప్లో మధ్యాహ్న భోజన వివరాలు నమోదు చేయాలి. వంట గది ప్రదేశం, సరకులు నిల్వచోటు, వండే పాత్రలు, చెత్త డబ్బా, విద్యార్థులు తినే ప్రదేశం, మంచినీటి సదుపాయం, చేతుల శుభ్రత, గుడ్ల ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి.
- జగనన్న విద్యాకానుక సమాచారం, పంపిణీ చేసిన కిట్లకు విద్యార్థుల తల్లులతో బయోమెట్రిక్ అథంటికేషన్ తీసుకోవాలి. పిల్లల కాలిబూట్ల కొలతలు ఉపాధ్యాయులే దగ్గరుండి పర్యవేక్షించాలి. బోధనేతర సిబ్బంది లేనిచోట గురువులే పిల్లల పాదాల కొలతలు తీసి యాప్లో నమోదు చేయాలి.
- నాడు-నేడు పనుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తుండాలి. నిధుల లభ్యత, కొరత, నిర్మాణ సామగ్రి వివరాలను యాప్లో నమోదు చేస్తుండాలి.
మరుగుదొడ్ల ఫొటోలు తీస్తున్న ఉపాధ్యాయుడు
ఫొటో బాగోలేకున్నా వివరణ ఇవ్వాల్సిందే..
ఐఎంఎంఎస్ యాప్ను కృత్రిమ మేధతో (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనుసంధానం చేశారు. మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయగానే మీరు తీసిన ఫొటోలు బాగోలేవు.. నిర్వహణ సరిగ్గా లేదనే కామెంట్ వస్తోంది. దానికి మరలా ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఒక్క గుడ్డు గురించే మూడు కోణాల్లో ఫొటోలు తీసి పెడుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలల విలీనం తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అక్కడ ఈ యాప్ల నిర్వహణ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇటు బోధనపై దృష్టిపెట్టాలా?, లేకుంటే అటు ఆన్లైన్లో సమాచారం పొందుపరచడమే పనిగా ఉండాలో తెలియడం లేదని గురువులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు అంతకంతకు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ యాప్ల నిర్వహణలోనే ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది.
2019-20, 20-21 వరుస రెండేళ్లు పదోతరగతి పరీక్షలను కొవిడ్ కారణంగా నిర్వహించలేదు.. అందరు విద్యార్థులను ఉత్తీర్ణులు చేశారు.
2015-16 నుంచి 2018-19 వరకు పదో తరగతిలో ఎప్పుడు 93 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదయ్యేది కాదు. 2019-23 వరకు జరిగిన పరీక్షల్లో సగటున 75 శాతం ఉత్తీర్ణతతో తిరోగమన ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 4,120
ఏకోపాధ్యాయ పాఠశాలలు 501
విద్యార్థులు 3.63 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు