బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం.
జగన్ని నమ్మితే అప్పులపాలే
నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. గతంలో మాదిరిగా ‘ ఫీజులు ఇంతే కడతాం. ఇంతకంటే ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి. మీ చావు మీరు చావండి’ అనే విధానానికి స్వస్తి పలికాం. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు జమ చేస్తున్నాం.
‘విద్యా దీవెన’ గురించి సీఎం జగన్ గొప్పలు
రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. వారందరినీ జగన్ నట్టేట ముంచారు. అయిదేళ్లుగా సమయానికి నిధులు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు ఫీజులు చెల్లించకుంటే పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. తమ పిల్లల చదువుకు ఆటంకాలు ఎదురవుతాయని తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. దీంతో దొరికిన చోట అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి పిల్లల ఫీజులు చెల్లించారు. వైకాపా ప్రభుత్వ ‘ఫ్యూజు’పీకేస్తేనే పరిస్థితి గాడిన పడుతుందని పలువురు చెబుతున్నారు.
బటన్ నొక్కినా రాని నిధులు
ఒక విద్యా సంవత్సరానికి నాలుగు విడతలుగా విద్యా దీవెన నిధులు విడుదల చేస్తారు. 2023-24 సంవత్సరంలో అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన నిధుల విడుదలకు మార్చి 1న సీఎం జగన్ బటన్ నొక్కారు. కానీ ఇప్పటికీ తల్లుల ఖాతాలకు జమ కాలేదు. ఆ త్రైమాసికానికి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 44,177 మంది విద్యార్థులను అర్హులుగా తేల్చారు. వారికి మొత్తం రూ.34.72 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇంకా మూడు విడతలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈలోగా పరీక్షలు రావడంతో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజులు చెల్లించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పట్లో నిధులు విడుదల చేసే అవకాశం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వాస్తవం
నగరానికి చెందిన ఓ విద్యార్థిని ఒక ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్ చివరి ఏడాది చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు. రూ.25 వేల ఫీజు బకాయి చెల్లిస్తేనే హాల్టికెట్ ఇస్తామని యాజమాన్యం తేల్చిచెప్పింది. కొద్ది రోజుల్లో అప్పు చేసైనా చెల్లిస్తామని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. కుమార్తె వేదన చూడలేని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు వారాల్లో రూ.12 వేలు చెల్లిస్తానని తల్లి నుంచి హామీ పత్రం తీసుకుని విద్యార్థినికి హాల్టికెట్ అందించారు.
రూ.35 వేలు చెల్లించా: మా అబ్బాయి పీఎం పాలెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఫీజు చెల్లించకుంటే పరీక్షలు రాయడం కుదరదని కళాశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో మొత్తం రూ.35 వేలు చెల్లించా.
- అన్నాజీ, ప్రైవేటు ఉద్యోగి
కొలువులకు దూరం..
తెదేపా హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేవారు. ప్రభుత్వం, యాజమాన్యాల మధ్యే ఫీజుల వ్యవహారం కొనసాగేది. ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిడి లేకుండా విద్యార్థులు చదువు పూర్తిచేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని మార్చేసి.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మధ్యలోకి లాగారు. విధానాలు మార్చడంపై పెట్టిన దృష్టి నిధుల విడుదలపై లేకపోయింది. అయిదేళ్లలో ఒక్కసారి కూడా చెప్పిన సమయానికి నిధులు విడుదల చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదువు పూర్తయిన విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు అప్పు చేసి చెల్లిస్తుండగా.. మరికొందరు ధ్రువపత్రాలు తీసుకోలేదు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినా వెళ్లలేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.