logo

విశాఖ-చెన్నై ఎగ్మోర్‌ మధ్య ప్రత్యేక రైలు

రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Updated : 24 Apr 2024 04:54 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ- చెన్నై ఎగ్మోర్‌(08557) ప్రత్యేక రైలు ఈనెల 27 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం రాత్రి 7గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.45 గంటలకు ఎగ్మోర్‌ వెళుతుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై ఎగ్మోర్‌-విశాఖ(08558) రైలు ఈనెల 28 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎగ్మోర్‌లో బయలుదేరి రాత్రి 10.35 గంటలకు విశాఖ వస్తుంది. ః విశాఖ-హతియా(08555) ప్రత్యేక రైలు ఈనెల 28 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు హతియా వెళుతుంది.

 

 

ః హతియా-విశాఖ(08556) ప్రత్యేక రైలు ఈనెల 29 నుంచి జులై 1 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటలకు హతియాలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.50గంటలకు విశాఖ వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు