సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు.
సంగీత శిక్షణపై బాలల్లో మక్కువ
అనకాపల్లిలో వేసవి శిక్షణ శిబిరాలు
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే
గిటార్ సాధనలో పిల్లలు
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన సంగీత సాధన నేడు పట్టణాలకూ విస్తరించింది. విద్యార్థుల అభిరుచికి తగ్గట్టు నృత్యం, గిటార్, పియానో, గీతాలు ఆలపించడం, చిత్రలేఖనంలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ దొరికిన సమయాన్ని వినియోగించుకుంటున్నారు. గతంలో వేసవి సెలవులు దొరికితే ఆటపాటలతో కాలం గడిపే విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా తగిన ప్రణాళిక వేసుకుంటున్నారు. సెలవుల్లో ఆడుకుంటునే తమ అభిరుచులకు అనుగుణంగా శిక్షణ తరగతులను వినియోగించుకుంటున్నారు. అనకాపల్లిలో సంగీత సాధనకు సంబంధించిన శిక్షణ తరగతులను మే 1 నుంచి జూన్ 10 వరకు నిర్వహిస్తున్నారు.
నృత్య సాధనలో ఉత్సాహంగా..
తమ్ముడితో కలిసి..
నేను ఆరో తరగతి. మా తమ్ముడు నాలుగో తరగతి. వేసవిలో సంగీత శిక్షణ ఇస్తున్నారని ఇక్కడికి వచ్చాం. ప్రతి రోజూ నృత్య సాధన చేస్తున్నాం. మెలకువలు నేర్పుతున్నారు.
ఆర్.సూర్యమిత్, రోషన్ సుభాష్
పాశ్చాత్య నృత్యంపై ఆసక్తి..
వేసవి సెలవులు వృథా కాకుండా సంగీత సాధనలో చేరాను. పాశ్చాత్య నృత్యం నేర్చుకుంటున్నా. వేసవిలో ఈ అవకాశం లభించడం ఆనందంగా ఉంది. పాఠశాలలు ఉన్నప్పుడు అవకాశం ఉండదు. సరైన సమయంలో శిక్షణ ఇవ్వడం బాగుంది.
కె.శ్రీజ, ఆరో తరగతి విద్యార్థిని
పియానో నేర్చుకుంటున్నా
నాకు పియానో అంటే చాలా ఇష్టం. నేర్చుకోవాలని ఉన్నా నేర్పించే వారు లేకపోవడంతో నిరాశ కలిగేది. వేసవి శిక్షణలో భాగంగా అనకాపల్లిలో నేర్పిస్తున్నారని చేరాను. ఇక్కడ తర్ఫీదు పొందుతా!
ఎన్.తన్వీర్
శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది..
నాకు గిటార్ అంటే చాలా ఇష్టం. ఇందులో శిక్షణ తీసుకుంటున్నా. వేసవి సెలవుల్లో ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్న సమయంలో సంగీత సాధనపై శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని ఇక్కడ చేరాను. సంగీతంలో అందిస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది.
అనూష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..