రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు.
ఎన్నికల నేపథ్యంలో స్వాధీనం
పాడేరు, నక్కపల్లి, న్యూస్టుడే
కాగిత వద్ద పట్టుకున్న భారీ నగదు చూపుతున్న పోలీసులు
ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు.
మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చెక్పోస్టుల ఏర్పాటుతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, విజిలెన్స్ తదితర విభాగాలు తనిఖీల పేరిట రంగంలోకి దిగాయి. ఎన్నికల ముందు నుంచే నక్కపల్లి మండలం కాగిత వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ఆ మేరకు అన్ని చోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా ఎటువంటి ఆధారాలు, అనుమతులు లేకుండా అక్రమంగా తరలించే నగదు, మద్యం, గంజాయి తదితర వాటిని పట్టుకున్నారు. జిల్లాలో చెక్పోస్టుల పనితీరును స్వయంగా కలెక్టర్ రవి, ఎస్పీ మురళీకృష్ణ పలుమార్లు తనిఖీ చేయడంతోపాటు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఇంక ఈ తనిఖీల్లో 1040 కేసులు నమోదు చేసి, 1273 మందిని అరెస్టు చేయగా, దాదాపు రూ. 3.89కోట్ల విలువైన సామగ్రిని పట్టుకున్నారు. కోడ్ రావడానికి ముందే కాగిత టోల్గేట్ వద్ద తనిఖీల ద్వారా పోలీసులు రూ. 2.07 కోట్ల నగదు పట్టుకున్నారు. దీనికి ఏ ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ రెండు నెలల్లో పట్టుకున్న దానికి ఇది అదనం. ఎలమంచిలి మండలం సోమలింగంపాలెం వద్ద గడ్డివాములో దాచిన రూ. 49 లక్షలకుపైగా విలువైన 39 వేల పైచిలుకు మద్యం సీసాలను పట్టుకున్నారు. దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో గంజాయి, మద్యం, ప్రలోభాలకు గురి చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కోడ్ ఉల్లంఘనపైనా కేసులు
అల్లూరి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 24 కేసులు నమోదు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. అక్రమ మద్యంపై 34 కేసులు నమోదు చేశారు. 4776 లీటర్ల నాటు సారా, 2740 లీటర్ల మద్యం సీజ్ చేశారు. 2,424 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చెక్పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు 23 కేసులు నమోదు చేశాయి. ఆయా బృందాలు రూ.1,98,400 నగదు, 35 లీటర్ల నాటుసారా, 90 లీటర్ల మద్యం, 32.50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని తొమ్మిది ప్రాంతాల్లో చెక్గేట్లు ఏర్పాటు చేశారు. సుమారు 100 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు