అమలవ్వని నిషేధం.. తప్పదా అపాయం!
ఆంధ్రాఊటీ అరకులోయలో ప్రకృతి రమణీయత దెబ్బతీసేలా ఉన్న పాలిథిన్ వాడకాన్ని నిషేధించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించినా.. ఇక్కడి అధికారులకు పట్టడం లేదు.
విచ్చలవిడిగా పాలిథిన్ వినియోగం
అరకులోయలో పేరుకుపోయిన పాలిథిన్ వ్యర్థాలు
అరకులోయ, న్యూస్టుడే
ఆంధ్రాఊటీ అరకులోయలో ప్రకృతి రమణీయత దెబ్బతీసేలా ఉన్న పాలిథిన్ వాడకాన్ని నిషేధించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించినా.. ఇక్కడి అధికారులకు పట్టడం లేదు. నిషేధం మాటల్లో తప్ప చేతల్లో అమలు కావడం లేదు. రెండేళ్ల క్రితం సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోలు పాలిథిన్ వాడకంపై పూర్తి నిషేధం ప్రకటించారు. అరకులోయ పట్టణంలో ప్రతి రోజూ పంచాయతీ అధికారులు లౌడ్ స్పీకర్లలో పాలిథిన్ వాడకంపై నిషేధం విధించినట్లు పేర్కొనడమే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అరకులోయలో విచ్చలవిడిగా పాలిథిన్ వాడకం జరుగుతోంది. విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు అరకులోయలో 100 కేజీల పైచిలుకు పాలిథిన్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. దుకాణాలపై దాడులు చేయకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ వ్యర్థాలకు నిప్పు పెడుతుండటంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటీవల అరకులోయ ప్రాంతంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల కేసులు నమోదు కావడం గమనార్హం. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం కల్పించాలంటే పాలిథిన్పై ఉక్కుపాదం మోపాల్సి ఉంది. అరకులోయ వంటి ప్రకృతి రమణీయ ప్రాంతంలో పరిశుభ్రమైన గాలి పీల్చుకునే వెసులుబాటు కల్పించాలన్నా.. పర్యటకుల మనసు చూరగొనాలన్నా నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. తాగునీటి ప్యాకెట్ల విక్రయాలను గతంలో నిలిపివేశారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో వీటిని ప్రస్తుతం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. శృంగవరపుకోట నుంచి ప్రతి రోజూ వ్యాన్లలో వేలాదిగా ఇవి అరకులోయ వస్తున్నాయి. అధికారులు ఎటువంటి ఆంక్షలు విధించకపోవడంతో వాటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అరకులోయ ప్రాంతంలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా అక్కడ గుట్టలుగుట్టలుగా తాగునీటి ప్యాకెట్ల వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆంధ్రాఊటీ అరకులోయలో పాలిథిన్ నిషేధాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని స్థానికులు, పర్యటకులు కోరుతున్నారు.
పాలిథిన్ నిషేధం అమలు కాకపోవడంపై జిల్లా పంచాయతీ అధికారి కొండలరావుని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించి పాలిథిన్ విక్రయించే వారికి అపరాధ రుసుం విధించాలని ఆదేశించామన్నారు. అప్పటికీ మార్పు రాకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. త్వరలోనే అరకులోయలో దుకాణదారులు, ప్రజలతో సమావేశం నిర్వహించి నిషేధం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు