logo

వైభవంగా నృసింహ జయంతి

వైశాఖ శుద్ధ చతుర్దశి, స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి క్షేత్రంలో బుధవారం శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరిగింది

Updated : 23 May 2024 05:07 IST

 ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు, చక్రపెరుమాళ్‌ స్వామి

సింహాచలం, న్యూస్‌టుడే: వైశాఖ శుద్ధ చతుర్దశి, స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి క్షేత్రంలో బుధవారం శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరిగింది. అర్చకులు వేకుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామి, దేవేరులను సర్వాంగ సుందరంగా అలంకరించి శేషవాహనంపై కొలువుదీర్చారు. మరో పల్లకీలో సుదర్శనమూర్తిని అధిష్ఠింపజేసి నాదస్వర మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ సింహగిరి మాడవీధుల్లో ఊరేగించారు. తిరువీధిగా తరలివచ్చిన స్వామి, అమ్మవార్లను యాగశాల ఆవరణలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని