పట్టాలపై అలజడి
వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిన విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం 6.20గంటల సమయంలో స్టేషన్ నుంచి బయలుదేరింది.
జన్మభూమి రైలు నుంచి విడిపోయిన బోగీలు
తెగిపోయిన ఏసీ బోగీ కప్లింగ్!
3 గంటల పాటు ప్రయాణికుల పాట్లు
రైల్వేస్టేషన్, న్యూస్టుడే: వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిన విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం 6.20గంటల సమయంలో స్టేషన్ నుంచి బయలుదేరింది. రైలంతా కోలాహలంగా ఉంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కంచరపాలెం వంతెన సమీపంలో ఎం1 ఏసీ బోగీకి చెందిన కప్లింగ్ తెగిపోవడంతో రైలు నుంచి విడిపోయింది. దాని వెనుక ఎం2, సీ1 ఏసీ బోగీలు, మరో నాలుగు జనరల్ బోగీలు ఉన్నాయి. దీంతో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. ఏమి జరుగుతుందో తెలియక కొందరు గట్టిగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న అధికారులు రైలును నిలిపివేసి తిరిగి 7వ నెంబరు ప్లాట్ఫామ్పైకి తీసుకొచ్చారు. అక్కడ మరమ్మతులు చేసిన అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో రైలు బయలుదేరి వెళ్లింది. దాదాపు 3గంటలపాటు స్టేషన్లోనే ఉండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగారు. రైలు తక్కువ వేగంతో వెళ్తున్న సమయంలో బోగీలు విడిపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
నిర్వహణలో లోపాలే కారణమా?
వాల్తేర్ కోచింగ్ యార్డులో ఈ రైలు నిర్వహణ పనులు పూర్తి చేసి బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్లాట్ ఫామ్పైకి తీసుకొచ్చారు. అప్పటికే పలు బోగీలపై అనుమానంతో తొలగించి వాటి స్థానంలో ఇతర బోగీలను జతచేసి రైలును సిద్ధం చేసినట్లు సమాచారం. బోగీలను మార్పు చేసినప్పటికీ ఇలా జరగడం ఏమిటని అధికారులు మండిపడుతున్నారు. ఏడీఆర్ఎం సుధీర్కుమార్ గుప్తా స్టేషన్ అధికారులతో సమావేశమై కప్లింగ్ విడిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే వాల్తేర్ అధికారులు మాత్రం రైలు బయలుదేరడానికి ముందు ఆయా బోగీలకు విద్యుత్తును సరఫరా చేసే కప్లర్లో సాంకేతిక లోపాలను గుర్తించామని, దీంతో వాటిని మార్పు చేసి పంపినట్లు చెబుతుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం