వైకాపా నాయకత్వం.. ఆరంభ శూరత్వం..!!
సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ పేరుతో హడావుడి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపాదనతో తొలుత చకచకా సగం చేసి చేతులెత్తేసిన తీరుపై విమర్శలు సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం కొన్ని నెలల క్రితం వాయువేగంతో ప్రారంభించారు.
సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ పేరుతో హడావుడి
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపాదనతో తొలుత చకచకా
సగం చేసి చేతులెత్తేసిన తీరుపై విమర్శలు
హనుమంతువాక వద్ద తవ్వి వదిలేసిన కొండవాలు
సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ పేరుతో హడావుడి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపాదనతో తొలుత చకచకా సగం చేసి చేతులెత్తేసిన తీరుపై విమర్శలు సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం కొన్ని నెలల క్రితం వాయువేగంతో ప్రారంభించారు. ప్రస్తుతం పనులు ఆగిపోయాయి. నాడు ఎందుకు చకచకా సాగించారు...నేడెందుకు చేయడం లేదనే అంశం చర్చనీయాంశంగా మారింది. పైగా... చేసిన పనులు కూడా మొక్కుబడిగా ఉన్నాయి. దీని వల్ల నిధులు వృథా తప్ప పూర్తి ప్రయోజనం కనిపించడం లేదనే విమర్శలొస్తున్నాయి.
ఎంపీ విజయసాయిరెడ్డి వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఈ పనులపై చేసిన హడావుడి అంతాఇంతా కాదు. వాస్తవానికి కొండ చుట్టూ ఆక్రమించేందుకు ఎక్కడెక్కడ అవకాశముందో గుర్తించిన తరువాత ఆ ప్రాంతంలో గోడ పనులు మొదలుపెట్టారన్న ఆరోపణలు కూడా నాడు వచ్చాయి.
సింహాచలం కొండ చుట్టూ ఎంపీ లాడ్స్ నిధులు రూ. 5 కోట్లతో ప్రహరీ నిర్మాణానికి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపాదించారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పనులు చేయాలని నిర్ణయించారు.సింహాచలం అధికారులకు ఈ ప్రహరీ నిర్మాణంపై మొదటి నుంచి ఆసక్తి లేదు. అయినప్పటికీ ముందుకే వెళ్లారు. ఒక విధంగా చెప్పాలంటే సింహాచలం దేవస్థానానికి సంబంధం లేకుండా వీఎంఆర్డీఏ అధికారులే అన్ని రకాల అంచనాలు తయారు చేసి పనులు మొదలుపెట్టారు. అకస్మాత్తుగా ప్రహరీ నిర్మాణమంటే వివాదాలు తలెత్తుతాయని. ‘కొండపై ఔషధ మొక్కల పరిరక్షణ అనే అంశాన్ని తెరమీదికి తెచ్చారు. అరుదైన వృక్ష జాతుల సంరక్షణకు గోడ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒక విధంగా దేవాదాయశాఖ ప్రమేయం లేకుండానే పనులు ఆరంభించారు. కీలక నేత అప్పగించిన బాధ్యత కావడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. అత్యవసరంగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేశారు. కొండ చుట్టూ అయిదు దశల్లో ఈ పనులు చేయాలని నిర్ణయించారు. అప్పటికే అడవివరం నుంచి కొంతవరకు ప్రహరీ ఉంది. గోడ లేని చినగదిలి నుంచి హనుమంతువాక వరకు రెండు దశల్లో పనులు చేపట్టారు.
అంతా తాత్కాలికమే..
రెండు కి.మీ. మేర రూ.2 కోట్లతో పనులు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం గత కొంత కాలంగా ఈ పనులు నిలిపేశారు. హనుమంతువాక వద్ద ఈ పనుల కోసం కొండ వాలును తవ్వి వదిలేశారు. ఇప్పుడది ప్రమాదకరంగా మారింది.
- సింహాచలం దేవస్థానం మొదట్లో భూమి అప్పగించిన మేర పనులు చేపట్టగా ఆ తర్వాత వదిలేశారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి వైవీ సుబ్బారెడ్డిని నియమించినప్పటి నుంచి పనులు నెమ్మదించాయి. ఆ తర్వాత పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు. చేసిన పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రహరీ నిర్మించకుండా సిమెంటు పలకలతో తాత్కాలికంగా నిర్మించడంపైనా విమర్శలు వస్తున్నాయి. పునాదులు కొంత వరకు తవ్వి అందులో ఈ పలకలను అమర్చారు. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని స్థానికులు వాపోతున్నారు. తాత్కాలిక నిర్మాణాలు కావడంతో ఇప్పటికే కొన్ని చోట్ల పలకలను ఎత్తుకెళ్లిపోయారు. మధ్యమధ్యలో కొన్నింటిని తీసి పారేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం