రహదారిపైనే సంత..తప్పని చింత!
మన్యంలో వారపు సంతలకున్న ప్రాధాన్యత, ఆదరణే వేరు. గ్రామాల్లో దుకాణాలున్నా గిరిజనులు వారపు సంతలకే అధికంగా ప్రాధాన్యమిస్తారు.
చింతపల్లి, న్యూస్టుడే: మన్యంలో వారపు సంతలకున్న ప్రాధాన్యత, ఆదరణే వేరు. గ్రామాల్లో దుకాణాలున్నా గిరిజనులు వారపు సంతలకే అధికంగా ప్రాధాన్యమిస్తారు. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వందలాది వాహనాల్లో వచ్చి దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. దీంతో మన్యంలో సంతలన్నీ సూపర్మార్కెట్లను తలపిస్తుంటాయి. చాలా చోట్ల ఇవి రహదారులకు ఆనుకునే నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
చింతపల్లి మండలంలో ఆదివారం కోరుకొండ, సోమవారం అన్నవరం, మంగళవారం లోతుగెడ్డ కూడలి, బుధవారం చింతపల్లి, గురువారం లంబసింగిలో వారపుసంతలు జరుగుతాయి. ఒక్క అన్నవరం మినహా మిగతాచోట్ల వీటికి ప్రత్యేకంగా స్థలాలు లేవు. దీంతో వ్యాపారులు రహదారికి ఇరువైపులా దుకాణాలు వేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. లోతుగెడ్డ కూడలిలో గతంలో దుకాణాలను మార్కెట్యార్డు నిధులతో నిర్మించినా వాటిని వ్యాపారులు వినియోగించడం లేదు. ఇవి నిరుపయోగంగా మారాయి. రహదారికి ఆనుకునే ఇరువైపులా అన్ని రకాల దుకాణాలూ వేయడం వల్ల ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటోంది. ఇటీవల ఆటోలు, జీపులు వంటి ప్రైవేటు వాహనాలు బాగా పెరిగాయి. ద్విచక్రవాహనాల వినియోగం బాగా పెరిగింది. సంతల రోజున వాహనాలు తప్పుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తప్పుకొనే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో లంబసింగి వారపుసంతను పంచాయతీ కార్యాలయం వెనుక ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నించినా భూ యజమాని అంగీకరించకపోవడంతో మార్పు జరగలేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అధికార యంత్రాంగం మన్యంలోని వారపు సంతలకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తే ఇబ్బందులు తప్పుతాయి. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపడతామని తహసీల్దారు రామకృష్ణ తెలిపారు. త్వరలో వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు, పంచాయతీ పాలకవర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
యమపాశాలు వెంటాడుతున్నాయ్..!
[ 26-07-2024]
అయిదు రోజుల క్రితం రాంబిల్లి మండలం పంచదార్లలో ఓ యువకుడిపై పొలంలోని విద్యుత్తు తీగపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. -
ఊళ్లన్నీ నీళ్లు.. గుడారాలే దిక్కు.!
[ 26-07-2024]
పోలవరం నిర్వాసితుల వరదపాట్లు ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అవగతం అవుతుంది. -
అంధకారంలో గిరి గ్రామాలు
[ 26-07-2024]
మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెట్లు నేల కూలి, విద్యుత్తు స్తంభాలు, తీగలు పడిపోయి గ్రామాల్లో అంధకారం ఏర్పడింది. -
బురద నీరే దిక్కు!
[ 26-07-2024]
వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో తాగునీరు కలుషితమై గిరిజనులకు బురదనీరే దిక్కు అవుతోంది. జి.మాడుగుల మండల కేంద్రంలో చేతి బోర్లు, తాగునీటి బావుల్లో నీరు కలుషితమైంది. -
ముంపులో ముప్పుతిప్పలు..
[ 26-07-2024]
కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, దేవీపట్నం: ముంపు మండలాలను గోదావరి వరదలు వీడటం లేదు. -
అంత్యక్రియలకు అష్టకష్టాలు!
[ 26-07-2024]
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గెడ్డల ఉద్ధృతితో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. -
తాడు తెగిందా.... ప్రాణం గోవిందా
[ 26-07-2024]
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్