నీటికి నిలకడ నేర్పుతూ...!
కాలం మారుతున్నా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ రైతులు సంప్రదాయ పద్ధతులనే ఆచరిస్తున్నారు. ఇవి పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా వర్షపునీటిని సద్వినియోగం చేసుకోవడంలో వీరు ముందుంటున్నారు.
చింతపల్లి, న్యూస్టుడే
కాలం మారుతున్నా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ రైతులు సంప్రదాయ పద్ధతులనే ఆచరిస్తున్నారు. ఇవి పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా వర్షపునీటిని సద్వినియోగం చేసుకోవడంలో వీరు ముందుంటున్నారు.
గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం అత్యధిక శాతం కొండ, ఏటవాలు ప్రాంతాల్లోనే జరుగుతుంటుంది. అక్కడ కేవలం వర్షాధారంగా పంటలను పండించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో రైతులు ఎప్పుడు వర్షం పడినా ఆ నీటిని ఒడిసిపట్టి సాగునీటిగా మలుచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్ పనులను జూన్, జులై నెలల్లో వర్షాలు కురిసే సమయంలో ప్రారంభిస్తుంటారు. అల్లూరి జిల్లాలో గిరి రైతులు ఇందుకు ప్రత్యేకమనే చెప్పాలి. వీరు నెలలతో సంబంధం లేకుండా ఎప్పుడు వర్షం పడితే అప్పుడే వ్యవసాయ పనులను ప్రారంభిస్తుంటారు. ప్రస్తుతం మే నెల అయినప్పటికీ అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మన్యంలో అప్పుడే వ్యవసాయ పనులు ప్రారంభించేశారు.
రాతికట్టల నిర్మాణం
గిరిజన ప్రాంతాల్లో 90 శాతం మంది రైతులు కేవలం వర్షాధారంగానే దాదాపు అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు. సాగునీటి వనరులున్నా తగినన్ని చెక్డ్యాంలు, కాలువలు లేక, ఉన్నవి పనిచేయక నీరందడం లేదు. ఈ కారణంగానే రబీలో దాదాపు పొలాలన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. పశువులను యథేచ్ఛగా వదిలేస్తుంటారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు వాననీటి సద్వినియోగం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. కొండ దిగువన ఉన్న పంట పొలాలకు నీరందించడంతోపాటు సాగునీటి నిల్వకు రాతికట్టలను నిర్మిస్తున్నారు. కొండలపై పడే వర్షపునీరు లోతట్టు ప్రాంతాల్లోకి కొట్టుకుపోకుండా ఇవి ఉపయోగపడుతున్నాయి.
కేజీ బియ్యం ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే నీరు ఎంతో తెలుసా.. అక్షరాలా నాలుగు నుంచి ఐదువేల లీటర్లు. నమ్మలేకపోయినా ఇది నిజం. శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో నీటి వనరులు తగినంతగా లేక వ్యవసాయానికి కొందరు దూరమవుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటలకు అవసరమైనంత నీటి వినియోగంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు.
వాననీటిలో వినియోగించేది 15 శాతమే..
ఏ పంటకైనా సరే అవసరానికి మించి నీరు వాడితే లాభం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. వర్షపు నీటిని గిరిజన రైతులు కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. సుమారు 40 శాతం వర్షపునీరు భూమిలోకి ఇంకకుండా వృథాగా పోతోంది. దీనివల్ల నీటితోపాటు పంటకు అందాల్సిన విలువైన పోషకాలతో కూడిన మట్టి సైతం కొట్టుకుపోతోంది. ఈ పరిస్థితిని నివారించాలంటే వర్షపు నీటిని ఎక్కడికక్కడ నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గిరి రైతులకు శాస్త్రీయ విధానాలు తెలియకపోయినా వారు సంప్రదాయ విధానాలతోనే నీటి సంరక్షణ విషయంలో ముందుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల