logo

జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం

జాతీయ రహదారిపై నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద శుక్రవారం పెను ప్రమాదం తప్పింది.

Published : 25 May 2024 01:43 IST

ఒకే మార్గంలో వెళుతున్న వ్యాను, బస్సు, లారీ ఢీ

నక్కపల్లి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం.. విజయనగరం నుంచి గుంటూరుకు 34 మంది ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరారు. బస్సు సాయంత్రం ఉద్దండపురం సమీపానికి రాగానే వర్షం కురుస్తుండగా, ముందు వెళ్తున్న వ్యాన్‌ డ్రైవర్‌ అకస్మాతుగా బ్రేకు వేశాడు. బస్సు డ్రైవర్‌ దీన్ని తప్పించేందుకు పక్కకు తీస్తుండగా, ఇదే మార్గంలో వస్తున్న లారీ వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు వ్యాన్‌ను ఢీకొంది. ప్రమాదంలో బస్సు ముందు, వెనుక భాగాలు దెబ్బతినగా, ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.   లారీ ముందుభాగం స్వల్పంగా దెబ్బతింది. బస్సులో గాయపడ్డవారితో పాటు, మిగిలిన వారు అక్కడి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వెళ్లిపోయారు. ఈ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని