పాదచారుల వంతెనలపై ప్రమాద ఘంటికలు
తూర్పు కోస్తా రైల్వే విశాఖ రైలు నిలయంలో నిత్యం ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాల్సిన వాల్తేరు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రైల్వేస్టేషన్లో పలు చోట్ల శిథిలం
ఆందోళనలో ప్రయాణికులు
విశాఖపట్నం, న్యూస్టుడే: తూర్పు కోస్తా రైల్వే విశాఖ రైలు నిలయంలో నిత్యం ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాల్సిన వాల్తేరు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లో మూడు పాదచారుల వంతెనలు ఉన్నాయి. వాటిలో గేట్-1 ప్రధాన వంతెన 3, 4 ప్లాట్ఫామ్ల మధ్య ఏప్రిల్ 8న కుంగిపోయింది. వాల్తేరు రైల్వే అధికారులు దాన్ని హుటాహుటిన తొలగించారు. వాడుకలో ఉన్న వంతెన ఒక్కసారి కుంగిపోవడానికి కారణాలపై విచారణ చేపట్టారు. అంతే కాకుండా స్టేషన్లో మిగిలిన వంతెనల పరిస్థితిపై తనిఖీలు నిర్వహించారు. అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని అధికారులు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల స్తంభాలు తుప్పుపట్టి శిథిలమైనట్లు గుర్తించారు. త్వరలో స్టేషన్ ఆధునికీకరణ చేపట్టనుండడంతో ఆ వంతెనలకు ప్రత్యేకంగా చేసేదేమి లేక పక్కన పెట్టినట్లు సమాచారం. కుంగిపోయిన వంతెన భాగాన్ని తొలగించడంతో పాటు పూర్తిగా మూసేశారు. దీంతో స్టేషన్లో మిగిలిన రెండు వంతెనలపై భారం పడి నిత్యం తీవ్ర రద్దీ నెలకొంటోంది. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. స్టేషన్లో అత్యధిక రైళ్లు 3, 4 ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తుండటం.. ఆయా వంతెనలు కిక్కిరిసిపోతుండడంతో రాకపోకలు సాగించే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి తోపులాట జరుగుతుండడంతో భయాందోళన చెందుతున్నారు.
ఆ వంతెన అందుబాటులోకి వచ్చేదెప్పుడో..!
కుంగిపోయి మూతపడిన వంతెనను వాల్తేరు అధికారులు ఇప్పట్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే వంతెన మూతపడి 40 రోజులు గడిచిపోయాయి. ఇంత వరకు ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఈ వంతెనలో 1వ నంబరు ప్లాట్ఫామ్ నుంచి 3వ నంబరు ప్లాట్ఫామ్ వరకు పాడైనట్లు గుర్తించిన అధికారులు ఆ భాగాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పనులు ఎప్పడు ప్రారంభిస్తారు.. ఎప్పటికి వంతెన అందుబాటులోకి వస్తుందనే అంశంపై వాల్తేరు అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికైనా వంతెన పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి