ఏజెన్సీలో ఉచిత న్యాయ సేవలే లక్ష్యం
ఏజెన్సీ ప్రాంతంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి జాతీయ న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందించనున్నట్లు రంపచోడవరం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ పి.బాబు పేర్కొన్నారు.
మేజిస్ట్రేట్ బాబు
రంపచోడవరం, న్యూస్టుడే: ఏజెన్సీ ప్రాంతంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి జాతీయ న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందించనున్నట్లు రంపచోడవరం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ పి.బాబు పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం న్యాయవాదులు, ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ, పోలీసు శాఖ అధికారులతోపాటు సచివాలయాల మహిళా పోలీసులు, మహిళా సంఘాల వారితో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ బాబు మాట్లాడుతూ కొంతమంది మహిళలు పొట్టకూటి కోసం వ్యభిచార ఊబిలోకి దిగుతున్నారని, దీనికి స్వస్తి పలికేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. రేషన్, ఆధార్, ఓటరు ఐడీ కార్డులు లేనివారు దరఖాస్తు చేస్తే లీగల్ సెల్ ద్వారా న్యాయం చేయవచ్చన్నారు. కొండపోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం అమలులో ఉందన్నారు. 18 నుంచి 22 ఏళ్ల వయసున్న వారిని గంజాయి కూలీలుగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. సీఐ వాసా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీలో చాలామంది మహిళలకు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉందని తెలియదన్నారు. గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సదస్సులో ఐటీడీఏ ఏపీఓ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు అబ్సులోము, ఎంపీడీఓ హరికృష్ణ, వెలుగు ఏపీడీ శ్రీనివాసరావు, సీడీపీఓలు సంధ్యారాణి, ప్రసన్నలక్ష్మి, న్యాయవాదులు ఎం.వి.ఆర్.ప్రకాష్, సత్యప్రసాద్, చుక్కా సంతోష్కుమార్, వెంకట్రావు, జిలానీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల