సీతారామయ్యా.. ఎంత కష్టమొచ్చిందయ్యా!
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహిస్తూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.
దేవీపట్నం, న్యూస్టుడే
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహిస్తూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయంలో శుక్రవారం రైతు ఉండమట్ల సీతారామయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయడం నిర్వాసిత గ్రామాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
ఊళ్లో పది మందికి పని కల్పించి.. గ్రామానికి తనవంతు సాయం చేస్తూ.. పరిసర గ్రామాల్లో మంచి రైతుగా సీతారామయ్యకు పేరుంది. దేవీపట్నం మండల కేంద్రంలో ఆయన పేరు తెలియని వారుండరు. గ్రామంలో కొండపై ఉన్న చోళరాజుల కాలం నాటి శివాలయానికి ఛైర్మన్గా పనిచేశారు. ఆలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. చోళరాజుల కాలం నాటి ఆలయం కావడంతో ఏటా శివరాత్రి రోజున వేల సంఖ్యలో వచ్చే భక్తుల అన్న సమారాధన కార్యక్రమంలో ఆయనే ముందుండి నడిపించేవారు. పూర్వ కాలం నుంచి గ్రామంలో పెద్దరైతు కావడంతో అనేక మందికి నిత్యం తన పొలంలో పని కల్పించేవారు. ఆయనకున్న భూమికి, ఇంటికి సైతం ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. అయితే పోలవరం ముంపులో ఆయనను నిర్వాసితుడిగా గుర్తించలేదు. అధికారులు ఆయన కుటుంబాన్ని ఆర్అండ్ఆర్ ప్యాకేజీల్లో అర్హులుగా గుర్తించలేదు. దాదాపు ఐదేళ్లుగా రంపచోడవరం ఐటీడీఏ, ధవళేశ్వరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆ పెద్దాయన అలసిపోయారు. ఈ క్రమంలోనే శుక్రవారం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి అధికారుల తీరుతో మనస్తాపానికి గురై కార్యాలయం వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ముంపు గ్రామాల్లో కలకలం: సీతారామయ్య ఆత్మహత్యాయత్నం తెలుసుకున్న దేవీపట్నం మండలం పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దేవీపట్నంలో ఉన్న నిర్వాసితులు ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఘటనపై స్థానిక అధికారులు సైతం ఆరాతీస్తున్నారు. శనివారం ఆసుపత్రికి ముంపు గ్రామాల నిర్వాసితులు పెద్ద సంఖ్యలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం