జలవనరుల ఆధునికీకరణకు జెల్ల
సాగునీటి వనరుల ఆధునికీకరణ, ఆయకట్టు స్థిరీకరణకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), ప్రపంచ బ్యాంకులు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.
చెరువుల బాగుపై చేతులెత్తేసిన సర్కారు
ప్రపంచబ్యాంకు నిధులిచ్చినా ఉపయోగించుకోని తీరు
ఆధునికీకరణకు నోచుకోని తాజంగి జలాశయం కాలువ
ఈనాడు అనకాపల్లి: సాగునీటి వనరుల ఆధునికీకరణ, ఆయకట్టు స్థిరీకరణకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), ప్రపంచ బ్యాంకులు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. జలవనరుల శాఖ ప్రతిపాదనలు, అంచనాలకు అయిదేళ్ల క్రితమే ఆమోదం తెలిపాయి. ఆయా పనులు మాత్రం కార్యరూపంలోకి తీసుకురాలేక సర్కారు చేతులెత్తేసింది. విదేశీ సంస్థలు సొమ్ములివ్వడానికి ముందుకొచ్చినా వైకాపా సర్కారు తన వాటాధనం ఖర్చు చేయడానికి వెనకడుగు వేయడంతో అయిదేళ్లలో ఒక్క చెరువు కూడా బాగు చేయలేకపోయారు. ప్రభుత్వంపై నమ్మకం లేక టెండర్లు వేయడానికి గుత్తేదారులు ముందుకు రాలేదు.. వచ్చినవారు మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోవడంతో చెరువులకు చేటే మిగిలింది.
ఉమ్మడి జిల్లాలో 69 గొలుసుకట్టు చెరువులతో పాటు రైవాడ జలాశయం కాలువుల ఆధునికీరణకు ప్రపంచబ్యాంకు, జైకా సంస్థలు నిధులివ్వడానికి ఆసక్తి చూపాయి. తాము ఇచ్చే సొమ్ములకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి సాగునీటి వనరుల అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించాయి. మొత్తం రూ. 89.31 కోట్లతో 14,123 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి అడుగులు వేశారు. రూ.58.99 కోట్లతో 39 పనులకు నాలుగేళ్ల క్రితమే టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించారు. వారు కొంత మేర పనులు చేసినా బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడంతో వారంతా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే అయిదు పనులకు సంబంధించి గుత్తేదారులతో ఒప్పందాలు రద్దు చేసేశారు. మిగతా గుత్తేదారులు అదే బాటలో ఉన్నారు.
జైకా నిధులతో ఆధునికీకరించాల్సిన రైవాడ జలాశయం కాలువ దుస్థితి ఇదీ
అనకాపల్లి జిల్లాలో..
- రూ.11.59 కోట్ల జైకా నిధులతో 31 మైనర్ ఇరిగేషన్ చెరువుల ఆధునికీకరణ పనులు చేయడానికి మూడేళ్ల క్రితమే ఆరు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. వీటి ద్వారా 5,596 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఆశించారు. కొన్ని చెరువుల పనులు మొదలుపెట్టినా పూర్తి చేయలేకపోయారు. ఇప్పటివరకు కేవలం రూ. 15 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారంటే ఈ పనుల ప్రగతి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
- జైకా నిధులతోనే రైవాడ జలాశయం కాలువ ఆధునికీకరణ చేపట్టారు. రూ. 30.43 కోట్లతో నాలుగేళ్ల క్రితమే టెండర్లు పిలిచి ఓ గుత్తేదారు సంస్థకు అప్పగించారు. మొదటి ఏడాది రూ.4 కోట్ల పనులు చేసినా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, చేసిన పనులు కాలువ ప్రవాహంలో కొట్టుకుపోవడంతో సదరు గుత్తేదారు సంస్థ మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది.
- ప్రపంచబ్యాంకు నిధులతో 50 చెరువులను పునరుద్ధరణ కోసం రూ. 33.46 కోట్ల విలువైన పనులకు టెండర్లు నాలుగేళ్ల క్రితమే పిలిచారు. అందులో 33 చెరువుల పనులకు గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకున్నారు. మిగతా 17 చెరువు పనులకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిలో కదలిక లేకుండా పోయింది. గుత్తేదారులు చేపట్టిన పనులు కూడా బిల్లులు చెల్లింపుల్లో జాప్యం కారణంగా మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం రూ. 1.93 కోట్లు పనిమాత్రమే జరిగింది.
అల్లూరి జిల్లాలో...
ప్రపంచబ్యాంకు నిధులు రూ.3.36 కోట్లతో అయిదు చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. వాటిలో మూడు పనులకు మాత్రమే గుత్తేదారులు ముందుకు వచ్చారు. మూడేళ్లలో కేవలం రూ. 6.92 లక్షలు మాత్రమే ఈ పనులపై ఖర్చుచేశారు. మిగిలిన రెండు పనుల్లో ఒక గుత్తేదారు మొదటే పనిచేయలేమని తప్పుకొన్నారు. మరోపనికి గుత్తేదారు ఎవరూ ముందుకు రాలేదు.
ఇదీ పనుల తీరు..
- రాంబిల్లి మండలం దిమిలి వద్దనున్న తామరచర్ల కాలువ అభివృద్ధికి రూ. 97.37 లక్షల అంచనా విలువతో 2019లోనే గుత్తేదారుకు అప్పగించారు. ఈ పని చేయాల్సిన కాలపరిమితిని రెండుసార్లు పొడిగించినా పని మాత్రం జరగలేదు.
- ఎస్.రాయవరం మండలం వేమగిరిలో ఉమ్మడి చెరువుతోపాటు 12 అనుసంధాన చెరువులు, కాలువలను బాగు చేయడానికి రూ. 7.47 కోట్ల పనులు గుత్తేదారుకు 2020లో అప్పగించారు. కేవలం 15 శాతం మాత్రమే చేసి మధ్యలోనే వదిలేశారు.
- చింతపల్లి మండలం తాజంగి జలాశయం అభివృద్ధికి రూ. 92.21 లక్షలు కేటాయించారు. బిల్లుల చెల్లింపులపై అనుమానంతో గుత్తేదారు కేవలం ఆరుశాతం పనులు చేసి నిలిపేశారు.
- కొయ్యూరు మండలంలో లుబ్బర్తి జలాశయం అభివృద్ధికి రూ. 44.19 లక్షలు మంజూరు చేశారు. గుత్తేదారు కూడా 75 శాతం పనులు పూర్తిచేశారు. చేసినవాటికి సకాలంలో బిల్లులు అందకపోవడంతో మిగతా 25 శాతం పనులు చేయకుండా నిలిపేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు