ఎగుమతులకు వీలుగా అటవీ ఉత్పత్తులు
గిరిజన రైతులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులతోపాటు వారు సేంద్రియ విధానాల ద్వారా పండిస్తున్న ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులకు దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు ఉందని ఏపీ ఆహార శుద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె.సుభాష్ పేర్కొన్నారు.
పనస అనుబంధ తయారీ ఉత్పత్తులను పరిశీలిస్తున్న రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుభాష్
చింతపల్లి, న్యూస్టుడే: గిరిజన రైతులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులతోపాటు వారు సేంద్రియ విధానాల ద్వారా పండిస్తున్న ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులకు దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు ఉందని ఏపీ ఆహార శుద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె.సుభాష్ పేర్కొన్నారు. శనివారం లంబసింగిలో ఆయన పర్యటించారు. అక్కడకు సమీపంలోని రాజుపాకలులో లంబసింగి ట్రైబల్ ఫార్మô్్స ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనస పండ్ల నుంచి పచ్చళ్లు, చిప్స్, జామ్, జ్యూస్ వంటి అనుబంధ ఉత్పత్తుల తయారీని పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో ఎగుమతులకు అనువైన అనేక పంటలు, వనరులు ఉన్నాయన్నారు. గిరిజన రైతులు పంటలను ముడి సరకుగానే విక్రయించడం వల్ల లాభాలు పొందలేకపోతున్నారని చెప్పారు. రైతులంతా సంఘాలుగా ఏర్పడి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేస్తే మంచి ఫలితాలుంటాయని పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 5,200 మంది రైతులతోపాటు సంఘాలకు అనేక ప్రోత్సాహకాలు అందించామన్నారు. తాజాగా అల్లూరి జిల్లాలో మినీ కాఫీ బేబీ పల్పింగ్ యంత్రాలు 250 వరకూ రాయితీపై పంపిణీ చేశామని పేర్కొన్నారు. లంబసింగి ఎఫ్పీఓ ద్వారా గిరిజన మహిళలతో సుమారు 70 రకాల అనుబంధ ఉత్పత్తులు తయారు చేసి వాటిని ఎగుమతి చేస్తున్నట్లు కిసాన్ నెస్ట్ ఎండీ రాజేష్ తెలిపారు. ఎఫ్పీఓ డైరెక్టర్లు కూడా సరోజ, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.