ఆ నిధులు వెనక్కు ఇచ్చేయండి
రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కోసం విడుదల చేసిన నిధులు ఖర్చు కాకపోవడంతో ఆ నిధులన్నీ పక్కాగా తమకు తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గిరిజన సంక్షేమానికి కేటాయించిన సొమ్ము దారి మళ్లింపు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహం
చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన మ్యూజియం పనులు
పాడేరు పట్టణం, చింతపల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కోసం విడుదల చేసిన నిధులు ఖర్చు కాకపోవడంతో ఆ నిధులన్నీ పక్కాగా తమకు తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో నిధుల వివరాల సేకరణలో ఆ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖకు ఏటా కేంద్రం నుంచి రూ. కోట్లలో నిధులు విడుదల అవుతుంటాయి. ఈ నిధులతో ప్రధానంగా ఆదివాసీ గిరిజనుల సంక్షేమంతోపాటు వనబంధు కల్యాణ యోజన, ఏకలవ్య పాఠశాలలు, గురుకులాల అభివృద్ధితోపాటు ఇతర కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఆయా నిధులను రాష్ట్రంలోని తొమ్మిది ఐటీడీఏలకు జనాభా ప్రాతిపదికన గిరిజన సంక్షేమశాఖ కమిషనరేట్ కేటాయిస్తోంది. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో కేంద్రానికి పంపాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులు వేర్వేరు పథకాలకు మళ్లిస్తోంది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆయా నిధుల ఖర్చులు, జమపై తమకు పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఒక వేళ ఖర్చు కాకపోతే వడ్డీతో లెక్కించి తమకు వాపసు చేయాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
- రాష్ట్రంలో పెద్దదైన పాడేరు ఐటీడీఏకు కేంద్రం నుంచి నిధులు భారీగా సమకూరాయి. ప్రధానంగా సుమారు రూ.89.2 కోట్లతో 2020-21లో ఏర్పాటు చేసిన పసుపు ప్రాజెక్టుకు కేంద్రం వాటాగా సుమారు రూ. 55.02 కోట్ల వరకూ కేటాయించారు. ఈ నిధులు వేర్వేరు పథకాలకు మళ్లించడంతో ప్రాజెక్టు నిర్వీర్యమైంది. చింతపల్లి మండలం తాజంగిలో రూ. 35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన మ్యూజియంకు కేంద్రం వాటాగా సుమారు రూ. 20 కోట్లు విడుదల చేశారు. ఆయా నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు అవసరాలకు వినియోగించడంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ మ్యూజియం పనుల పరిశీలనకు గతంలో కేంద్ర బృందం వచ్చింది. వనబంధు పథకం ద్వారా జి.మాడుగుల మండల అభివృద్ధికి రూ. 10 కోట్లు కేంద్రం విడుదల చేయగా.. ఆ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాలేదని స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ప్రతి మండలంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణం నిమిత్తం ఒక్కో పాఠశాలకు రూ. 25 కోట్ల వరకు కేంద్రం కేటాయించింది. గురుకుల పాఠశాలల అభివృద్ధి, పీవీటీజీ, సీసీడీపీ తదితర పథకాల ద్వారా పాడేరు ఐటీడీఏకు నిధులు భారీగా సమకూరాయి. ఈ లెక్కలన్నీ ఇప్పుడు కేంద్రానికి ఐటీడీఏ సమర్పించాల్సి ఉంది.
- పీఎం- జన్మన్ పథకం ద్వారా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 274 పీవీటీజీ గ్రామాల్లో తాగునీరుతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంది. దీని కోసం ఒక్కో గ్రామానికి రూ. 25 లక్షల వరకూ కేటాయించారు. ఈ పథకం అమలు తీరుపై గత ఏడాది అరకులోయ కేంద్రంగా ప్రధానమంత్రి మోదీ వర్చువల్గా సమీక్షించారు. పీవీటీజీల పురోగతిపై ఆరా తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు