నడి బజారులో పెద్దాస్పత్రి పరువు..!
ఉత్తరాంధ్రా జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఎన్నడూ లేని విధంగా అధికారులు, సిబ్బందిలో విచ్చలవిడితనం పెరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆరోపణలపై ఇద్దరు అధికారుల సరెండర్
బాలికపై ఓ ఉద్యోగి వేధింపులు
సిబ్బందిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
కేజీహెచ్లో గాడితప్పిన పాలన
ఉత్తరాంధ్రా జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఎన్నడూ లేని విధంగా అధికారులు, సిబ్బందిలో విచ్చలవిడితనం పెరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో దిగువ స్థాయి సిబ్బంది, ఉద్యోగులపై ఆరోపణలు వస్తే ఇప్పుడు ఏకంగా కీలక పోస్టుల్లో పనిచేస్తున్న అధికారులపై కూడా ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి.
స్థానికంగా అందుబాటులో ఉండే అధికారులకు ఫిర్యాదులు చేసినా అతీగతీ లేకపోవడంతో ఏకంగా సీఎంఓకు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాలకు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు..
1. నెల రోజుల వ్యవధిలో నర్సింగ్ విభాగ గ్రేడ్-1 సూపరింటెండెంట్, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ స్థాయి అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డీఎంఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ ఉన్నత స్థాయి అధికారులను సరెండర్ చేసిన సందర్భాలు లేవు.
2. చికిత్స కోసం వచ్చిన గిరిజన బాలికను వేధింపులకు గురి చేసిన ఆరోపణలపై ఓ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు ఆయనపై విచారణ జరుగుతోంది. ఆరు నెలల క్రితం జరిగిన బదిలీల్లో కేజీహెచ్ నుంచి మరో చోటుకు బదిలీ అయిన ఉద్యోగిని అనధికారికంగా కేజీహెచ్కు రప్పించారు. ఆ ఉద్యోగే ఇప్పుడు గిరిజన బాలికను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
3. కేజీహెచ్ నుంచి బదిలీ అయిన మరో ముగ్గురు ఉద్యోగులను డిప్యుటేషన్పై మళ్లీ తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆసుపత్రిలో బోలెడంత మంది ఉద్యోగులు ఉండగా వారిని డిప్యుటేషన్పై తీసుకు రావడం చర్చనీయాంశమవుతోంది. ఆ ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నప్పటికీ వారిని కొంతమంది అధికారులు వెనకేసుకొస్తున్నారు.
విచారణతో వెలుగులోకి వాస్తవాలు..: ఆసుపత్రి ఆవరణలోని నర్సింగ్ కళాశాలపై కూడా ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ర్యాగింగ్ జరుగుతోందని వచ్చిన ఫిర్యాదుపై స్వయంగా డీఎంఈ విచారణ జరిపారు. అదే విధంగా నర్సింగ్ విభాగ గ్రేడ్-1 సూపరింటెండెంట్, డిప్యూటీ సవిల్ సర్జన్ ఆర్ఎంఓలపై వచ్చిన ఆరోపణలపై డీఎంఈ విచారణ జరిపి వేటు వేశారు. ఈనెల 11న ప్రసూతి విభాగానికి వచ్చిన బాలికను ఉద్యోగి వేధిస్తే కేజీహెచ్ అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం శనివారం కేజీహెచ్ను సందర్శించి ప్రసూతి విభాగంలో జరిగిన ఘటనపై ఆరా తీశారు.
ప్రధానంగా వస్తున్న ఆరోపణలు ఇవీ..
కేజీహెచ్లో ఓపీ చీటీలు, కేసు షీట్ల జారీకి రోగుల నుంచి ముడుపులు తీసుకోవడం. వార్డుల వద్ద భద్రతా సిబ్బంది, ఎంఆర్ఐ, సీటీస్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే విభాగాల వద్ద కొంత మంది ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించడం. నర్సులకు సెలవులు ఇవ్వకపోవడం, ఈఎల్ మంజూరుకు లంచాలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది వైద్యులు సమయపాలన పాటించకపోవడం, ఓపీలకు హాజరు కాకపోవడం, సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఆయా అంశాలను ఎప్పటికప్పుడు చక్కదిద్దాల్సిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కుర్చీని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిచ్చి పెద్దాస్పత్రిని గాలికి వదిలేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు