ఆధునికీకరణకు..ఆదిలోనే అడ్డంకులు..
లిప్టులు 20... ఎస్కలేటర్లు 20.. రెండు వైపులా మల్టీలెవల్ కార్ పార్కింగ్లు.. రెండు ఆధునిక పాదచారుల వంతెనలు.., 9, 10 ప్లాట్ఫామ్లతో పాటు సరికొత్త హంగులతో జ్ఞానాపురం ద్వారం ఆధునికీకరణ.. ఇదీ విశాఖ రైల్వే స్టేషన్ ఉన్నతీకరణ జరగాల్సిన తీరు.
పనుల్లో జాప్యంతో గుత్తేదారు తొలగింపు
అతీగతీ లేని రైల్వేస్టేషన్ ఉన్నతీకరణ
పనులు జరగాల్సిన ప్రాంతంలో నిలిచిన మురుగు
విశాఖపట్నం, న్యూస్టుడే: లిప్టులు 20... ఎస్కలేటర్లు 20.. రెండు వైపులా మల్టీలెవల్ కార్ పార్కింగ్లు.. రెండు ఆధునిక పాదచారుల వంతెనలు.., 9, 10 ప్లాట్ఫామ్లతో పాటు సరికొత్త హంగులతో జ్ఞానాపురం ద్వారం ఆధునికీకరణ.. ఇదీ విశాఖ రైల్వే స్టేషన్ ఉన్నతీకరణ జరగాల్సిన తీరు.. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే 2025 చివరి నాటికి ఆయా సౌకర్యాలతో రైల్వేస్టేషన్ అందుబాటులోకి వచ్చేది.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..
విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు ఆరంభ శూరత్వంలా మారాయి. పనులు ప్రారంభమైన నాటి నుంచి 36 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఏడాదిన్నర గడిచిపోతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. టెండరులో పేర్కొన్న నిబంధనల ప్రకారం పనులు చేయడం లేదనే కారణంతో వాల్తేరు రైల్వే అధికారులు గుత్తేదారుని తొలగించారు. దాదాపు 5 నెలలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో పనులు చేపట్టిన ప్రాంతం మురుగు నీరు.. పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. ఇనుప చువ్వలు సైతం మురుగులోకి చేరి తుప్పు పడుతున్నాయి. ఆధునికీకరణ పనుల కోసం గతంలో పూర్తిగా మూసిన జ్ఞానాపురం వైపు గల గేట్-4 ప్రవేశ ద్వారాన్ని ఇటీవల తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పట్లో పనులు మొదలయ్యే అవకాశం లేదనే సంకేతాలు వస్తున్నాయి.
అధికారులు ఏమంటున్నారంటే..
ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగతుండటంతో గుత్తేదారుడ్ని తొలగించి తిరిగి టెండర్ ఆహ్వానించినట్లు వాల్తేర్ రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇంతలో ఎన్నికల నియమావళి రావడంతో ప్రక్రియ నిలిచిపోయినట్లు చెబుతున్నారు. 2025 చివరి నాటికి పూర్తి కావాల్సిన పనులు గుత్తేదారు అలసత్వం కారణంగా ఆలస్యమయ్యాయని, అయితే 2026 చివరి నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయా పనులు పూర్తయితే విశాఖ రైల్వేస్టేషన్ రూపరేఖలు మారుతాయని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు