ఈసారీ పుస్తకాల్లేని చదువులేనా?
జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందడం కలగానే మిగిలింది. గత విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలు అసలు రాకపోగా.. ఈ విద్యా సంవత్సరానికి పుస్తకాలు వస్తాయనే నమ్మకం కొరవడింది.
జిల్లాలో ఇంటర్ విద్యార్థుల అగచాట్లు
1 నుంచి జూనియర్ కళాశాలల పునఃప్రారంభం
పాడేరు పట్టణం, న్యూస్టుడేే: జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందడం కలగానే మిగిలింది. గత విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలు అసలు రాకపోగా.. ఈ విద్యా సంవత్సరానికి పుస్తకాలు వస్తాయనే నమ్మకం కొరవడింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల జూనియర్ కళాశాలలు, కేజీబీవీ విద్యాలయాలు 40 వరకు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటికే పుస్తక ముద్రణ, పంపిణీ జరగాల్సి ఉంది. మరి కొద్దిరోజుల్లో కళాశాలలు తెరుచుకోనున్నా పుస్తకాలు అందే పరిస్థితి కనిపించడం లేదు.
జిల్లాలోని 22 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో సుమారు 11 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి పాఠ్యపుస్తకాల సరఫరా కాకపోవడంతో బయట మార్కెట్లో గైడ్లు, ఇతర పుస్తకాలు కొనుగోలు చేసుకుని పరీక్షలకు సన్నద్ధం కావాల్సి వస్తోంది. పాఠ్యపుస్తకాలు లేక ఆయా సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించలేకపోతున్నారు. ఫలితంగా ప్రతి విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణతశాతంలో వెనుకంజలో నిలుస్తున్నారు. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠ్య పుస్తకాలు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క పుస్తకం కూడా ఇవ్వలేదు. వేల రూపాయలు ఖర్చు చేసి చదువుకోగలిగే స్థోమత ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉండదు. దీంతో వీరంతా అరకొర చదువులతోనే పరీక్షలకు వెళ్లాల్సి వస్తోంది.
రెండేళ్లుగా సరఫరా లేదు
ఇంటర్ పాఠ్య పుస్తకాలు రెండేళ్లుగా సరఫరా కావడంలేదు. గతంలో టీటీడీ నుంచి ముద్రించి ఇచ్చేది. విద్యార్థుల సంఖ్యను బట్టి పుస్తకాలు కావాలని ఇండెంట్ పెడతాం. పుస్తకాలు రాగానే విద్యార్థులకు అందిస్తాం.
- బి.సుజాత, అనకాపల్లి జిల్లా వృత్తివిద్యా శాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ