Suicide: ప్రియురాలి తీరుతో మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య
ఎన్ని సార్లు ఫోన్ చేసినా ప్రియురాలు తీయడంలేదని మనస్తాపం చెందిన రోమాల గంగాధర్ (24) ఆమె పుట్టిన రోజు నాడు ఆత్మహత్య చేసుకున్నారు.
గంగాధర్ (పాత చిత్రం)
ఎలమంచిలి, న్యూస్టుడే: ఎన్ని సార్లు ఫోన్ చేసినా ప్రియురాలు తీయడంలేదని మనస్తాపం చెందిన రోమాల గంగాధర్ (24) ఆమె పుట్టిన రోజు నాడు ఆత్మహత్య చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణ ఎస్సై పాపినాయుడు కథనం ప్రకారం.. పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన గంగాధర్ చాలా కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఏడాదిగా ఆమె ఇతనితో మాట్లాడటం మానేసింది. సోమవారం ఆమె పుట్టిన రోజు కావడంతో ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఆమె తీయకపోవడంతో మనస్తాపంతో అదే రోజు రాత్రి ఇంటిలోని వంటగదిలో ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరివేసుకున్నాడు. మంగళవారం ఈవిషయం వెలుగులోకి వచ్చింది.
బాలికపై అత్యాచారం కేసులో ఆటోడ్రైవర్కు 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్, న్యూస్టుడే: బాలికపై అత్యాచారం చేసిన నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.4లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గాజువాక డ్రైవర్స్కాలనీకి చెందిన మైచర్ల గణేష్ అలియాస్ ద్రాక్ష ఆటోడ్రైవర్గా పనిచేసేవాడు. అతనిపై పలు క్రిమినల్ కేసులు కూడా వున్నాయి. నడుపూరు ప్రాంతానికి చెందిన బాలిక (11) ఐదో తరగతి చదివేది. ఆమె కుటుంబంతో గణేష్కు కొద్దిపాటి పరిచయం ఉండేది. ఈ నేపథ్యంలో 2017 జూన్ 14న సాయంత్రం ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఆటో ఎక్కించుకుని గాజువాక సమీపంలోని కొంగపాలెం రహదారి చివరన నిర్మాణుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఆమె ఇంటి దగ్గరలో విడిచిపెట్టి పారిపోయాడు. బాధితురాలు ఏడుస్తూ ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఈ మేరకు బాధితులు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
యమపాశాలు వెంటాడుతున్నాయ్..!
[ 26-07-2024]
అయిదు రోజుల క్రితం రాంబిల్లి మండలం పంచదార్లలో ఓ యువకుడిపై పొలంలోని విద్యుత్తు తీగపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. -
ఊళ్లన్నీ నీళ్లు.. గుడారాలే దిక్కు.!
[ 26-07-2024]
పోలవరం నిర్వాసితుల వరదపాట్లు ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అవగతం అవుతుంది. -
అంధకారంలో గిరి గ్రామాలు
[ 26-07-2024]
మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెట్లు నేల కూలి, విద్యుత్తు స్తంభాలు, తీగలు పడిపోయి గ్రామాల్లో అంధకారం ఏర్పడింది. -
బురద నీరే దిక్కు!
[ 26-07-2024]
వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో తాగునీరు కలుషితమై గిరిజనులకు బురదనీరే దిక్కు అవుతోంది. జి.మాడుగుల మండల కేంద్రంలో చేతి బోర్లు, తాగునీటి బావుల్లో నీరు కలుషితమైంది. -
ముంపులో ముప్పుతిప్పలు..
[ 26-07-2024]
కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, దేవీపట్నం: ముంపు మండలాలను గోదావరి వరదలు వీడటం లేదు. -
అంత్యక్రియలకు అష్టకష్టాలు!
[ 26-07-2024]
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గెడ్డల ఉద్ధృతితో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. -
తాడు తెగిందా.... ప్రాణం గోవిందా
[ 26-07-2024]
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి