నేరేడుబంద.. సమస్యలే నిండా
అది మండలానికి శివారు ఆదివాసీ గ్రామం. దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ వన్యప్రాణులు సంచరిస్తుంటాయి.
జి.మాడుగుల, న్యూస్టుడే
బడి ఏర్పాటు చేయాలని నినదిస్తున్న గ్రామస్థులు
అది మండలానికి శివారు ఆదివాసీ గ్రామం. దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. విద్యార్థులు ఉన్నా.. పాఠశాల లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఉన్నా చెంతనే అంగన్వాడీ కేంద్రం లేదు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం బాలలు సాహసోపేత ప్రయాణం చేసి చదువుకోవాల్సిందే. దట్టమైన అటవీ ప్రాంతం గుండా విద్యార్థులు పాఠశాలకు ప్రాణాలు అరచేత పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి.జి.మాడుగుల మండలంలోని గడుతూరు పంచాయతీ నేరేడుబంద గ్రామంలో పీటీజీ తెగకు చెందిన 70 మంది నివసిస్తున్నారు. వీరిలో 28 మంది పిల్లలు ఉండగా.. 15 మంది మైదాన ప్రాంతమైన రావికమతం మండలంలోని చీమలపాడు పంచాయతీ జెడ్.జోగంపేట ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. జి.మాడుగుల మండలానికి ఓ వైపు విసిరేసినట్టుగా ఉండే గ్రామం ఇది కావడంతో ఈ గ్రామస్థులకు ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, అటు అనకాపల్లి జిల్లా యంత్రాంగం నుంచి ఎటువంటి సేవలు అందడం లేదు. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఉన్నా అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో పోషకాహారం అందని ద్రాక్షగా మారింది. దశాబ్దాలుగా నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రమదానంతో తాత్కాలిక రహదారి
దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఉండే నేరేడుబందకు కనీస రహదారి సదుపాయం లేదు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆసుపత్రులకు తరలించేందుకు డోలీమోతలే దిక్కు. నేరేడుబంద నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్.జోగంపేటలో బడికి విద్యార్థులు వెళ్లేందుకు కనీస రహదారి సదుపాయం లేదు. కొండలు, వాగులు, రాళ్లు, తుప్పలు దాటుకొని వెళ్లాలి. వర్షాకాలంలో వీరి బాధలు వర్ణనాతీతం. గ్రామస్థులందరూ ఐక్యంగా శ్రమదానంతో జెడ్.జోగంపేట వరకు తాత్కాలిక మట్టి రోడ్డు ఇటీవలే నిర్మించుకున్నారు. విద్యార్థులు సైతం ఇందులో చేయిచేయి కలిపారు. చిట్టి చేతులతో పలుగు, పారలు పట్టుకొని రహదారిని వేసుకున్నారు.
గుర్రాలపై పాఠశాలకు..
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు భయాందోళన చెందేవారు. జంతువుల భయంతో చిన్నారులు కొన్ని సమయాల్లో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. గ్రామంలోనే బడి ఏర్పాటు చేయాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదు. తమ పిల్లలను ఎలాగైనా చదివించుకోవాలనే దృఢ సంకల్పంతో తల్లిదండ్రులు గుర్రాలెక్కించి రోజూ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్.జోగంపేటకు తీసుకెళ్తున్నారు. వర్షాకాలంలో బడికి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు, గుర్రాలు అందుబాటులో లేకపోతే ఆ రోజు బడికి సెలవే.
శాశ్వత రహదారి నిర్మించాలి
నేరేడుబంద గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించాలి. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నాం. రోగులు, గర్భిణులను ఆసుపత్రులకు తరలించేందుకు డోలీమోతలపై ఆధార పడాల్సి వస్తోంది. అంగన్వాడీ కేంద్రం మంజూరు చేసి పోషకాహారం అందించాలి
- కిల్లో పొట్టిదొర, నేరేడుబంద
పిల్లలు భయపడుతున్నారు
నేరేడుబందలో పాఠశాల ఏర్పాటుచేయాలి. గ్రామంలో 28 మంది చిన్నారులు ఉంటే 15 మంది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్.జోగంపేట పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కనీస రహదారి లేదు. దట్టమైన అటవీ ప్రాంతం గుండా రోజూ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు. రోజూ మేమే గుర్రాలపై పాఠశాలకు తీసుకెళ్తున్నాం.
- డిప్పల అప్పారావు, నేరేడుబంద
గ్రామాన్ని సందర్శిస్తాం
గ్రామంలో సమస్యలు నేరుగా తెలుసు కునేందుకు నేరేడుబందలో పర్యటిస్తాం. అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఈ వారంలో ఒక రోజు గ్రామాన్ని సందర్శిస్తాం. అక్కడ రహదారి, పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపడతాం.
- గోపాలకృష్ణ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పాడేరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట